న్యాయం వైపే ఎవరి చూపైనా ఉంటుందేమో. ఎందుకంటే పవన్ పేరు ఎత్తితేనే మండి పడే నటి పూనమ్ కౌర్ కూడా వకీల్ సాబ్ కు వత్తాసు పలికింది. ట్విట్టర్ వేదికగా ఆమె చేసిన కామెంట్లు సంచలనం అయ్యాయి. అందరూ పూనమ్ కౌర్ ను మరిచిపోతున్న తరుణంలో మళ్లీ ఈ విధంగా ఆమె తెరపైకి వచ్చినట్లు అయ్యింది. ఆమె సినిమా చూసిందో లేదో మనకు తెలియదుగానీ మధ్యలోకి పోసాని కృష్ణ మురళిని లాగడం ఏమిటో అర్థం కావడం లేదు. పూనమ్ కౌర్ కోపం ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కాదు.. ఈ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఆమెకు ఆగ్రహం కలిగించిందట. అందుకే ప్రభుత్వ తీరును తప్పు పట్టింది. ఆమె ఏం కామెంట్ చేసిందో చూద్దాం.
‘సినిమాలకూ, రాజకీయాలకూ మధ్య ఉన్న సంబంధం అనేది పెద్దలు కుదిర్చిన పెళ్లి లాంటిది. ఇది ఒక వ్యవస్థాపరమైన సంబంధం. వ్యక్తులకు కాకుండా ప్రజలకు మేలు చేకూర్చేలా ఏ అంశమైనా ఉండాలి. మంచి కంటెంట్ ఉన్న సినిమాను ఎవరు చేసినా వారిని ప్రోత్సహించాలి. ఇలా డీ ఫేమ్ చేయకూడదు. ఇప్పుడు కుళ్లు రాజకీయాలు చేస్తున్నారు. అమ్మాయిలను డీఫేమ్ చేసి రాజకీయం చేస్తే తప్పు కాదు. అమ్మాయిలను రక్షించే సినిమా తీస్తే సమస్య ఎవరికి? పోసానిగారూ ప్రెస్మీట్ పెట్టండి’ అంటూ పూనమ్ వ్యాఖ్యలు చేసింది.
అంతా బాగానే ఉన్నా మధ్యలో పోసాని కృష్ణమురళిని లాగడం ఎందుకో అర్థం కావడం లేదు. అసలు ఈ విషయంలో పూనమ్ తెరపైకి రావడం ఎందుకో అర్థంకాదు. ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండంత సుఖం ఉండదన్న సామెతను ఆమె గుర్తు చేసుకుంటే మంచిది. పవన్ కళ్యాణ్ ను పొగిడినంత మాత్రాన ఆమె వచ్చే లాభం లేకపోగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఆమెకు జరిగే నష్టమే ఎక్కువ. ఇంత చిన్న లాజిక్ ను ఆమె ఎందుకు మిస్సయ్యిందో?
Must Read ;- ‘వకీల్ సాబ్’ వీక్షణకు మెగా సపరివార సమేతం











