ఏపీలో ఇసుక ద్వారా పదివేల కోట్ల రూపాయల దోపిడీకి వైసీపీ నేతలు మాస్టర్ ప్లాన్ వేశారని టీడీపీ సీనియర్ నేత జవహర్ విమర్శించారు.టీడీపీ హయాంలో ఉచిత ఇసుక విధానం ద్వారా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా లారీ ఇసుక రూ.8 వేలకు సరఫరా చేశామని ఆయన గుర్తు చేశారు.ఏపీలో నేడు లారీ ఇసుక రూ.50 వేలకు చేరిందన్నారు.రెండేళ్ల జగన్రెడ్డి పాలనలో ప్రజల కష్టాలు 20 రెట్లు పెరిగాయని జవహర్ ధ్వజమెత్తారు.రూ.375 ఉన్న టన్ను ఇసుకను ప్రైవేటు కంపెనీకి అప్పగించి వెంటనే రూ.475 చేశారని జవహర్ గుర్తు చేశారు.జేపీ పవర్ బినామీ కంపెనీ ద్వారా రూ.పది వేల కోట్ల దోపిడీకి తెర తీశారని ఆయన విమర్శించారు.
సాక్ష్యాలతో బయట పెట్టారు..
వైసీపీ నేతల ఇసుక ని మాజీ మంత్రి జవహర్ సాక్ష్యాలతో సహా బయట పెట్టారు.18 టన్నుల ఇసుక రూ.12,150 ధరకు జేపీ పవర్ అమ్ముతోందని తాజా బిల్లులు మీడియాకు చూపించారు.అంటే టన్ను ఇసుక రూ.675 వసూలు చేస్తున్నారని జవహర్ సాక్ష్యాలతో సహా మీడియాకు వెల్లడించారు.ప్రభుత్వం ప్రకటించిన రూ.375 ధరను తరవాత రూ. 475 చేసి ఇప్పుడు రూ.675 వసూలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.అంటే ప్రతి టన్నుపై రూ.200 కమీషన్ అధికార పార్టీ నేతలకు వెలుతోందని ఆయన అన్నారు.ఇక కృష్ణా నది ప్రకాశం బ్యారేజీలో పూడిక తీత పేరుతో కోటి 20 లక్షల టన్నుల ఇసుక తీసుకునేందుకు వైసీపీ నేతల బినామీ కంపెనీలకు అనుమతిచిచ్చారని జవహర్ తెలిపారు.దీని ద్వారా రూ.1400 దోపిడీకోట్ల దోపిడీకి తెరతీశారని ఆయన విమర్శించారు.రెండేళ్ల జగన్ పాలనలో అన్నివర్గాల ప్రజలు తీవ్రంగా మోసపోయారని,వైసీపీ పాలన శుస్క వాద్గానాలు,శూన్య హస్తాలు మాదిరి సాగుతోందని జవహర్ విమర్శించారు.
Must Read ;- జగన్ రెండేళ్ల పాలనలో ఏపీ 20 ఏళ్లు వెనక్కి వెళ్లింది : చంద్రబాబు నాయుడు











