(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు కన్ను మూశారు. శ్రీకాకుళంలోని ఆయన నివాసంలో ఈరోజు రామారావు తుదిశ్వాస విడిచారు.1924లో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాకలో కారా మాష్టారు జన్మించారు. శ్రీకాకుళంలో “కథా” నిలయాన్ని స్థాపించారు. యజ్ఞం, తొమ్మిది కథలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. గౌరవ డాక్టరేట్ను కారా మాష్టారు అందుకున్నారు.1996లో కారా మాస్టారు సాహిత్య అవార్డును అందుకున్నారు. కొంతకాలంగా వయోభారంతో ఇంట్లోనే ఉన్న కారా మాస్టారు ఈరోజు కన్నుమూశారు. రామారావు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
తెలుగు సాహిత్యానికి విశేష కృషి
కారా మాస్టారు మృతి పట్ల డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలుగు సాహిత్యానికి విశేషకృషి చేసిన ‘ కారా ‘ చిరస్మరణీయులన్నారు. కథారచనలో ఎందరికో మార్గదర్శిగా నిలిచిన ఆయన ఎంతో నిరాడంబరమైన జీవితాన్నిగడిపి, తన జీవితాన్నంతా కథలకు, కథానిలయానికే అంకితం చేశారన్నారు. ఆయన కుటుంబ సభ్యులందరికీ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సాహితీ అభిమానులు ఆయన మృతి పట్ల తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
Must Read ;- కారా మృతి సాహిత్యానికి తీరని లోటు : పవన్ కల్యాణ్











