విసిరిన రాళ్లనే పునాది రాళ్లుగా మార్చుకోవాలి..విమర్శించే నోళ్లే ప్రశంసించేలా ఎదగాలి. అప్పుడే అది అసలైన విజయం. టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్కు ఈ మాట అచ్చుగుద్దినట్లుగా సరిపోతుంది. ట్రోల్స్, బాడీ షేమింగ్తో ప్రత్యర్థులు కుంగదీయాలని తీసినా..తన అద్భుతమైన పనితీరుతో వారికి సమాధానం చెప్పారు లోకేష్. అనతికాలంలోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇవాళ నారా లోకేష్ బర్త్డే.
………….
నారా లోకేష్ ప్రయాణం అంత అషామాషీ కాదు. ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో MBA, కార్నెగీ మెలన్ లో బ్యాచిలర్స్ పూర్తి చేసిన ఉన్నత విద్యావంతుడు ఆయన. వరల్డ్ బ్యాంక్లో పని చేసిన అనుభవం,హెరిటేజ్ సంస్థను లాభాల బాటలో నడిపించిన ట్రాక్ రికార్డ్ ఆయన సొంతం. అలాంటి కార్పొరేట్ లగ్జరీ లైఫ్ను వదులుకుని, తాత, తండ్రి అడుగుజాడల్లో ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో తెరవెనుక వ్యూహకర్తగా మొదలై, ఆ తర్వాత ఎమ్మెల్సీగా, మంత్రిగా ఆయన ప్రయాణం ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్. ఐతే గడిచిన ఐదేళ్ల కాలం లోకేష్ను ఓ పూర్తి స్థాయి పొలిటిషీయన్గా మార్చింది. ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ..యువగళం పాదయాత్రతో జనం నాడి పట్టుకున్నారు. ఎండనకా, వాననకా వేల కిలోమీటర్లు నడిచి, ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ పాదయాత్రే లోకేష్లోని పోరాట పటిమను ప్రపంచానికి పరిచయం చేసింది.
………….
గడిచిన రెండేళ్లలో లోకేష్ తనను తాను నిరూపించుకున్నారు. ప్రధాని మోదీ సైతం నారా లోకేష్ను పలుమార్లు ప్రత్యేకంగా అభినందించారు. ఒకప్పుడు కేవలం చంద్రబాబు తనయుడిగా మాత్రమే తెలిసిన లోకేష్, ఇవాళ నేషనల్ పాలిటిక్స్లో కీ ప్లేయర్గా ఎదిగారు. NDA కూటమిలో టీడీపీ ప్రాధాన్యత పెరగడంలో లోకేష్ వ్యూహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోకేష్ విజన్ను, పనితీరును ప్రత్యేకంగా అభినందించడం ఆయన స్థాయిని తెలియజేస్తోంది. ఇటీవల ప్రధానితో జరిగిన భేటీలో ఏపీ అభివృద్ధిపై లోకేష్ చూపిన చొరవ, సబ్జెక్ట్ నాలెడ్జ్ జాతీయ నేతల దృష్టిని ఆకర్షించింది.
………….
ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా లోకేష్ పనితీరు ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడే HCL, కియా వంటి దిగ్గజాలు ఏపీకి వచ్చాయి. ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే..TCSను విశాఖకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. దీనివల్ల దాదాపు 10,000 మందికి ఉపాధి లభించనుంది. ఇక ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ పెట్టుబడిని తీసుకువచ్చి చీఫ్ జాబ్ క్రియేటర్గా పేరు సంపాదించుకున్నారు. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా..స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే కొత్త నినాదంతో అంతర్జాతీయ కంపెనీలను ఏపీకి క్యూ కట్టేలా చేస్తున్నారు.
………….
విద్యాశాఖ మంత్రిగా కూడా తనను తాను నిరూపించుకున్నారు లోకష్. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు విద్యార్థి లోకానికి కొత్త ఆశలను కల్పిస్తున్నాయి. నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేయడం ద్వారా తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, సిలబస్లో మార్పులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. విద్యార్థులతో మమేకమవుతూ, వారి ఆలోచనలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు.
………….
గత ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులు, వేధింపులకు గురైన కార్యకర్తలకు లోకేష్ అండగా నిలిచారు. గతంలో లోకేష్ను అవహేళన చేసిన నేతలే ఇవాళ ఆయన పేరు వింటే వణికిపోతున్నారు. లోకేష్ తీసుకువచ్చిన రెడ్బుక్ ఏపీ రాజకీయాల్లో సంచలనం. చట్టాన్ని అతిక్రమించి ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని, ప్రతి ఒక్కరి పేరును అందులో నమోదు చేస్తున్నామని ఆయన చేసిన హెచ్చరిక ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది.
………….
ఇవాళ మనం చూస్తున్నది పాత లోకేష్ను కాదు..లోకేష్ 2.0ని. మాటల్లో స్పష్టత, పనిలో వేగం, ఆలోచనలో పరిణితి ఆయనలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ భవిష్యత్ నాయకుడిగా తనను తాను నిరూపించుకుంటున్నారు. తండ్రి చాటు బిడ్డ అనే స్థాయి నుంచి, రాష్ట్రాన్ని నడిపించే సత్తా ఉన్న నాయకుడిగా లోకేష్ ఎదిగిన తీరు యువతకు స్ఫూర్తి. హ్యాపీ బర్త్ డే లోకేష్.
అమరావతి,మావిగన్ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!
వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...











