దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ‘పెళ్ళిసందడి’ మళ్ళీ మొదలవబోతోందని ఇటీవల అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్, దీప్ని భట్నాగర్, రవళి ప్రధాన పాత్రలు పోషించిన ‘పెళ్ళిసందడి’ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. కీరవాణి సంగీతం, చంద్రబోస్ సాహిత్యం, జయరామ్ కెమేరా పనితనం.. నటీనటుల పెర్పార్మెన్స్ ఆ సినిమాకి హైలైట్స్ గా నిలిచిపోయాయి.
ఇప్పుడు అదే మ్యాజిక్ ను రిపీట్ చేయడానికి రాఘవేంద్రరావే మళ్ళీ మెగాఫోన్ పట్టుకోవడం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆర్కామీడియా, ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఇందులో కేస్టింగ్ ను ఇంకా అనౌన్స్ చేయలేదు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ‘పెళ్ళిసందడి’ సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే.. కథానాయికగా శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ నటించబోతోందని ఫిల్మ్ నగర్ భోగట్టా. ఇదే కనుక నిజమైతే.. ఖుషీ కపూర్ కు హీరోయిన్ గా ఇదే తొలి చిత్రం అవుతుంది. మరి ఇందులో నిజానిజాలేంటో తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే.