July 7, 2026 2:08 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఎట్టెట్టా జయరాం! ఇట్టినా భూములు మింగినది ఇట్టేనా?

ఒక రియల్ ఎస్టేట్ సంస్థ భూములు.. 142 ఎకరాలు అమ్మడానికి బోర్డు తీర్మానించిందంటూ.. పత్రాలు తయారయ్యాయి. నిజానికి 202 ఎకరాల విక్రయాలు జరిగాయి. వ్యత్యాసం ఉన్న భూముల విషయంలో మాత్రమే కాదు.. మొత్తం లావాదేవీలోనే.. భయంకరమైన అక్రమాలు చోటు చేసుకుని ఉన్నాయనేది ఆరోపణ. ఇదంతా ఎవరి గురించో తెలుసా.. ఏపీలోని ఒక మంత్రిగారు.!

October 8, 2020 at 5:40 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(ది లియోన్యూస్ ఎక్స్‌క్లూజివ్ కథనం)

‘బెంజికారు మంత్రి’ అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు చటుక్కున గుర్తొచ్చే పేరు గుమ్మనూరు జయరాం. మంత్రుల్లో బోల్డంత మందికి బెంజికార్లు ఉండొచ్చు గానీ.. బెంజి పేరు వినగానే తన పేరు గుర్తొచ్చేలా చేసుకున్న.. హాట్ హాట్ గా వార్తల్లో ఉండే వ్యక్తి జయరాం. ఆయన అవినీతి కీర్తికథల్లో ఇప్పుడు మరో గొప్ప ఎపిసోడ్ చేరుతోంది.

ఇది ఏదో బెంజికారు లాంటి చిన్నా చితకా విషయం కానే కాదు. ఏకంగా 200 ఎకరాల భూకబ్జాలకు సంబంధించినది. మంత్రిగారు.. బెంగుళూరు  కేంద్రంగా వ్యాపారం చేసే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ భూములను అక్రమ లావాదేవీల రూపేణా  సుమారు 202 ఎకరాలు సొంతం చేసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విక్రయాలు జరిగినట్టుగా, పట్టాదారు పాస్ పుస్తకాల్లో  యాజమాన్య హక్కులు మారినట్లుగా రికార్డులు స్పష్టంగా ఉన్నాయి. అయితే.. ఇదంతా అక్రమ లావాదేవీ అని.. భూరికార్డులు తారుమారు చేసి.. గోల్ మాల్ చేశారని మంత్రి జయరాంపై కర్నాటకలో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

ఈ మొత్తం భూకబ్జా బాగోతం ఏంటో చూద్దామా..

‘ఇట్టినా’ అనేది సుమారు ముప్ఫయ్యేళ్ల కిందట బెంగుళూరు ఏర్పాటు అయిన రియల్ ఎస్టేట్ గ్రూపు. రియల్ ఎస్టేట్ తో పాటు, హోటళ్ల నిర్వహణ, నిర్మాణ వ్యవహారాలు కూడా వీరు చూస్తుంటారు. ఈ గ్రూపులో సుమారు 9కి పైగా కంపెనీలు ఉన్నాయి. వీటిలో భాగంగానే ఇట్టినా ప్లాంటేషన్స్ అనే సంస్థ కూడా 1993 ఏప్రిల్ 1 వతేదీన ఏర్పాటు అయింది. మహాబలేశ్వరప్ప, మంజునాధ్ లు ఈ సంస్థలో డైరక్టర్లు. మహాబలేశ్వరప్ప మరణించిన తర్వాత ఆయన కుమారులు ఇట్టినా మోనా, ఇట్టినా మనూలు 2008 ఆగస్టు 1న ఇదే సంస్థలో డైరక్టర్లుగా చేరారు. 2009 మార్చి 31 నాటినుంచి మంజునాధ్ ఈ సంస్థ డైరక్టర్ హోదాకు రాజీనామా చేసి పక్కకు తప్పుకున్నారు. ఆ నాటితో ఈ కంపెనీ వ్యవహారాలతో అతనికి సంబంధం పూర్తిగా తెగిపోయింది. 

అచ్చంగా ఇక్కడే మాననీయ మంత్రి వర్యులు రంగప్రవేశం చేశారు..

కొన్ని నెలల కిందట అంటే 2020 మార్చి రెండో తేదీన.. రెవెన్యూ శాఖ భూమి రికార్డుల హక్కు పత్రాల విషయంలో ఆయన జోక్యం చేసుకున్నారు. ఇట్టినా కంపెనీకి చెందిన భూములను, కంపెనీకి పదేళ్ల కిందటే రాజీనామా చేసేసిన మంజునాధ్ పేరు మీదకు మార్పించి.. ఆయన పేరిట భూయాజమాన్య హక్కు పత్రాలను సృష్టించారు. మామూలు వ్యక్తులు తమ భూయాజమాన్య హక్కు పత్రాలను రెవెన్యూ ఆఫీసుల్లో తమ పేరిట మార్పించుకోవడానికి కొన్ని నెలలపాటూ వారి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. కానీ గౌరవనీయ మంత్రిగారు జోక్యం చేసుకోవడం వల్ల.. రోజుల వ్యవధిలోనే రికార్డుల మార్పిడి మంజునాధ్ పేరిట మార్చడం జరిగిందనే ఆరోపణలున్నాయి.

ఆ తర్వాత.. మంజునాధ్ నుంచి కొనుగోలు చేసినట్లుగా పత్రాలు తయారుచేయించి.. తన కుటుంబ సభ్యుల పేరుమీద, తన బినామీల పేరుమీద యాజమాన్య పత్రాలు మార్పించారు. తన కుటుంబసభ్యుల పేరిట ఈ భూమిపత్రాలను మార్పించుకోవడంలో కూడా మంత్రిగారు చట్టబద్ధమైన తెలివితేటలు చూపించారు. 

మంత్రి భార్య రేణుక పేరుతో 30.83 ఎకరాలు, మంత్రి మొదటి తమ్ముడి భార్య ఉమాదేవి పేరుతో 30.53 ఎకరాలు, మంత్రి రెండో తమ్ముడి భార్య త్రివేణి పేరుతో 31.58 ఎకరాలు మొత్తం 92.94 ఎకరాలు కొనుగోలు చేసినట్లుగా పత్రాలు తయారయ్యాయి.  వీటితో మరో 115 ఎకరాల విస్తీర్ణం గల భూములు అదే రోజున (2 మార్చి 2020)  కొనుగోలు చేసినట్లుగా పత్రాలున్నాయి. 

వారిలో కె.శ్రీదేవి పేరుతో 12.76 ఎకరాలు, కె.అనంత పద్మనాభరావు పేరుతో 48.07 ఎకరాలు, లింగప్ప శశికళ పేరుతో 46.48 ఎకరాలు, నర్సారెడ్డి పేరుతో 4.00 ఎకరాలు కొన్నారు. వీరందరూ మంత్రిగారి బినామీలే అనే ఆరోపణలున్నాయి. 

ఈ విక్రయాలు పద్ధతి ప్రకారమే జరిగినట్లుగా రికార్డులు కూడా ఉన్నాయి. ఈ భూములను విక్రయించడానికి ఇట్టినా ప్లాంటేషన్స్ బోర్డు తీర్మానించినట్లుగా ఒక లేఖ కూడా ఉంది. అది దొంగ తీర్మానం అనే ఆరోపణలున్నాయి. 

అయితే మంత్రిగారు నకిలీ బోర్డు తీర్మానం పత్రాలు సృష్టించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు గానీ, ఇందులో కూడా  చిన్న పొరబాటు చేశారు. బోర్డు తీర్మానించిన ప్రకారం.. (అది నకిలీనా? నిజమేనా? అన్న సంగతి తరువాత) కేవలం 142 ఎకరాలు మాత్రమే విక్రయించాలి. అయితే మొత్తం 202 ఎకరాలు విక్రయం జరిగినట్లు రికార్డులు తయారయ్యాయి. 

ఆ తరువాత.. మంత్రి జయరాం భార్య రేణుక,  తమ్ముడు నారాయణస్వామి భార్య త్రివేణి, తమ్ముడు శ్రీనివాసులు భార్య ఉమాదేవి పేరిట భూములు మారినట్లుగా భూమి యాజమాన్య పత్రాలు రెవెన్యూ రికార్డుల్లో తయారయ్యాయి. 

భూ క్రయవిక్రయాల లావాదేవీలు జరిగేప్పుడు.. రెండు లక్షల రూపాయలకు మించిన చెల్లింపులు ఏవీ కూడా నగదు రూపంలో జరగడానికి వీల్లేదనే నిబంధన ఉంది. అయితే మంత్రి భార్య రేణుక పేరిట కొనుగోలు చేసిన డాక్యుమెంటులో 52,42,000 రూపాయలు నగదు చెల్లించినట్లుగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ.. 1.63 కోట్ల రూపాయలు నగదుగా బదలాయించినట్లు చూపించారు. 

కర్ణాటకలో పోలీసులకు ఫిర్యాదు

ఈ కొనుగోళ్ల లావాదేవీ పేరిట పత్రాలన్నీ 2 మార్చి 2020 తేదీతో తయారయ్యాయి. అయితే మేనెల నాటికి అసలు ఆ భూమలు యజమానులు మేలుకున్నారు. జరిగిన సంగతి గ్రహించారు. తమ కంపెనీకి చెందిన భూములను మంత్రి గుమ్మనూరి జయరాం కుటుంబ సభ్యుల పేరిట అన్యాక్రాంతం అయ్యాయంటూ కర్ణాటక రాష్ట్రం కోరమంగళలోని  పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో మంత్రి జయరాం భార్య రేణుక పేరును కూడా స్పష్టంగా ప్రస్తావించారు. ఏపీలో అధికార బలంతో.. తమను వేధిస్తున్నారంటూ.. కంపెనీ డైరక్టరు హోదాకు గతంలోనే రాజీనామా చేసిన మంజునాధ్ గురించి కూడా కంప్లయింటులో పేర్కొన్నారు. 

ఈలోగా, కర్నూలు జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు లో ఈ భూములను తనఖా పెట్టి రుణాలు తీసుకోడానికి ప్రయత్నం జరిగినట్టుగా పోపిడి వచ్చింది. దాంతో ఇట్టినా కంపెనీ యాజమాన్యం.. ఆ బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు పేర ఓ ఉత్తరం రాసింది. మంత్రి కుటుంబ సభ్యులు రుణం కోసం పెట్టుకున్న దరఖాస్తులను తిరస్కరించాలని అందులో కోరారు. 

వీరి వాదనకు బలం చేకూరుస్తూ.. మంత్రి కుటుంబసభ్యులకు రుణం మంజూరు చేయవద్దంటూ.. 2020 జూన్ 1వ తేదీన కోరమంగళ పోలీసు స్టేషన్ నుంచి బ్యాంకు సీఈవోకు అధికారికంగా లేఖ కూడా వచ్చింది. 

మంత్రి ఆదాయ వివరాలు ఇంకో పెద్ద కామెడీ

ఈ భూకబ్జాల భాగోతం ఒక ఎత్తు అయితే.. మంత్రి జయరాం ఇన్ కమ్ ట్యాక్స్ శాఖకు దాఖలు చేసిన ఆదాయ వివరాలు గమనిస్తే ఇంకా కామెడీగా అనిపిస్తుంది. 2015-16లో తన ఆదాయం రూ.3,92,958 గాను, 2016617లో తన ఆదాయం రూ.4,22,500 గాను, 2017-18లో తన ఆదాయం రూ.1,44,000 గాను మంత్రి పేర్కొన్నారు. 

2019 నాటి ఎన్నికల అఫిడవిట్ లో జయరాం పేర్కొన్న ప్రకారం.. రూ.47,88,755 విలువైన చరాస్తులు, రూ.35,00,000 విలువైన స్థిరాస్తులు, 8.50 ఎకరాల వ్యవసాయ భూమి, AP 21 BA 1188 నెంబరు గల టయోటా కారు ఉన్నాయని మాత్రం పేర్కొన్నారు.

మంత్రి గారు.. ఇప్పుడు ఏం చెప్తారు?

మంత్రి గుమ్మనూరు జయరాం- ఇట్టినా కంపెనీ భూములను వక్రమార్గంలో తన కుటుంబ సభ్యుల పేరు మీదికి మార్పించుకున్న ఆరోపణలకు సంబంధించి డాక్యుమెంటరీ ఆధారాలు అన్నీ బయటకు వచ్చాయి. 

 మరి ఇప్పుడు మంత్రి జయరాం ఏం చెప్తారో.. ఈ భూకబ్జా బాగోతంపై ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. 

 

Tags: gummanuru jayaramittina plantationsland grabbingleo exclusiveleotop
Previous Post

రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలు!

Next Post

ఈ ముగ్గురు దర్శకులకూ టైమిచ్చిన మెగాస్టార్

Related Posts

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Beautiful Actress Ruhi Singh is popular among the netizens for her incredible bikini outings

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

జగన్ మార్క్ న్యాయం.. సుగాలి ప్రీతి కేసు అటకెక్కేసిందా?

ఐఏఎస్ మళ్లీ చదువుకుని రావాలట.. జగన్ జమానాలో ఎన్నెన్ని వింతలో!

ఈడీకే న‌కిలీ మ‌కిలీ అంటించేశారే

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

ముఖ్య కథనాలు

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist