‘మహానటి’ సినిమా ద్వారా కీర్తిసురేష్ మంచి గుర్తింపు తెచ్చుకొని తెలుగు, తమిళ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం `సర్కారు వారి పాట’. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేష్ పేరు ప్రచారంలో ఉంది. కానీ అటు కీర్తి కాని ఇటు దర్శకుడు పరుశురామ్ కాని ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించలేదు. అయితే మహేష్ బాబు ఈ సస్పెన్స్ కు తెర దింపాడు.
ఈరోజు మహానటి కీర్తి సురేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మహేష్ ట్విట్టర్ లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశాడు. తమ ‘సర్కారు వారి పాట’ లోకి వెల్కమ్ అంటూ ఈ సినిమా కూడా ఆమె కెరీర్ లో మరపురాని చిత్రంగా నిలుస్తుంది అని మహేష్ ట్విట్ చేసాడు. ఈ ట్విట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటు మహేష్ బాబు, అటు కీర్తి సురేష్ ఇద్దరి అభిమానులకు ఈ వార్త మంచి ఉత్సాహం ఇస్తుంది అనడంలో సందేహం లేదు.
ఈ సినిమా షూటింగ్ వచ్చే నవంబర్ లో మొదలవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సహా మహేష్ బాబు సంస్థలు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు విలన్ గా నటుడు అరవింద్ స్వామి పేరు వినబడుతోంది. ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. కీర్తి సురేష్ ‘సర్కారు వారి పాట’ చిత్రంలో ఓకే అవ్వడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ అంచనాలను దర్శకుడు పరుశురామ్ ఏ విధంగా అందుకుంటాడో చూడాలి.
Here’s wishing the super talented @KeerthyOfficial a very happy birthday!! Team #SarkaruVaariPaata welcomes you aboard!! Will make sure it’s one of your most memorable films💥💥💥 Have a great one !! 😊😊😊 pic.twitter.com/MPzEWc0uGE
— Mahesh Babu (@urstrulyMahesh) October 17, 2020