మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు హీరోలుగా నటించిన ఒకప్పటి హిట్ మూవీ ‘బిల్లారంగా’. పి.యన్.ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై కె.యస్.ఆర్.దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో చిరంజీవి, మోహన్ బాబు ఇద్దరూ ద్విపాత్రాభినయం చేశారు. అప్పట్లో ‘బిల్లా రంగా’ అనే ఇద్దరు క్రిమినల్స్ కు ఉరిశిక్ష విధించారు. అయితే ఆ కథతో సినిమాకి సంబంధం లేకపోయినా.. ఆ ఇద్దరి పేర్లు అప్పట్లో మారుమోగిపోవడంతో.. వారి పేర్లు మాత్రమే సినిమాకి టైటిల్స్ గా పెట్టారు.
ఇప్పుడీ సినిమా గురించి ప్రత్యేకించి మాట్లాడుకొనేది ఎందుకంటే.. ఈ రోజు సాయిధరమ్ తేజ పుట్టినరోజు సందర్బంగా మంచు మనోజ్ తేజుని విష్ చేస్తూ.. ‘బిల్లారంగా’ సినిమా విడుదలై.. నేటికి 38 ఏళ్ళయిందని .. ఇది మనకేదో సంకేతం ఇస్తున్నట్టు నాకనిపిస్తోంది బాబాయ్… నేను రెడీ.. నువ్వు రెడీనా ? అంటూ ట్వీట్ చేశాడు. దాంతో ఈ మెగా, మంచు వారసులిద్దరూ.. ‘బిల్లారంగా’ రీమేక్ లో నటిస్తారేమోనని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఒకవేళ అదే కానీ జరిగితే.. మెగాభిమానులకు పండగే. ఈ ఇద్దరు హీరోలూ .. మాస్ యాక్షన్ మూవీస్ చేయడంలో దిట్ట. అయితే చిరంజీవి, మోహన్ బాబుల నటనను, వారి ఎనర్జీని ఏ మేరకు మ్యాచ్ చేస్తారు అన్నది చూడాలి.