ములుగు ఎమ్మెల్యే సీతక్క కరోనాపై పోరులో భాగంగా ఎంతోమంది పేదలకు సాయం చేస్తున్నారు. నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తూ పేదలను ఆదుకుంటున్నారు. అనారోగ్యం కారణంగా సీతక్క తల్లి హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఐసీయూకు తరలించారు. ఈ క్రమంలో తల్లిని చూసేందుకు సీతక్క వెళ్తుండగా, మల్కాజిగిరి డీసీపీ రక్షిత అడ్డుకున్నారు. సీతక్క సరైన ఆధారాలు చూపించినా కూడా విడిచిపెట్టలేదు. సుమారు అరగంట సేపు వాహనాన్ని రోడ్డుపై నిలిపివేశారు. చివరకు కిందిస్థాయి పోలీసులు స్పందించడంతో సీతక్క అక్కడ్నుంచి వెళ్లారు. ఈ విషయంపై ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ పోలీసులు కాస్త మానవత్వం చూపాలని, ప్రజల బాధను అర్థం చేసుకోవాలన్నారు.
Must Read ;- ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న : సీతక్క