ఆనాడు అమరావతి నిర్మాణం కోసం ప్రతి ఆంధ్రుడి గుండె కదిలింది. భారీగా విరాళాలు అందించడానికి ముందుకొచ్చారు. రైతుల త్యాగఫలమే నేటి అమరావతి అని ఎవరు మరవలేరు. సామాన్య ప్రజలు కూడా తమ వంతు కృషిగా విరాళమందించి.. అమరావతి నిర్మాణంలో భాగస్వాములయ్యారు. అందులో ముప్పవరపు స్వరాజ్యమ్మమంగళగిరి రూరల్ మండలం నీరుకొండ గ్రామనికి చెందిన ముప్పవరపు స్వరాజ్యమ్మ గారు కోటి రూపాయల విరాళమందించి ఆనాడు చర్చల్లో నిలిచారు. అమరావతి కోసం కలల కన్న ఆ కళ్లు శాశ్వతంగా మూసుకున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. అంతేకాదు.. అమరావతి రైతులు కూడా వారి సంతాపాన్ని తెలియపరిచారు.
‘మంగళగిరి రూరల్ మండలం నీరుకొండ గ్రామనికి చెందిన ముప్పవరపు స్వరాజ్యమ్మ గారు మరణించారన్న వార్త దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి నవ్యాంధ్ర ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి తన వంతుగా కోటి రూపాయలు విరాళంగా అందజేసిన ఆదర్శ మహిళా రైతు స్వరాజ్యమ్మగారు పేరుకు తగినట్టుగా సామాజిక బాధ్యత, ఆదర్శ వ్యక్తిత్వం కలిగిన స్వరాజ్యమ్మగారు ఈరోజు మన మధ్య లేక పోవటం బాధాకరం! అమరావతిని రాజధానిగా సాధించుకున్నప్పుడే స్వరాజ్యమ్మగారి ఆశయాలు ఫలిస్తాయి. స్వరాజ్యమ్మగారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను’.
Must Read;-అమరావతి రాజధాని భవనాలపై కమిటీ ఏమి తేల్చనుంది
పేరుకు తగినట్టుగా సామాజిక బాధ్యత, ఆదర్శ వ్యక్తిత్వం కలిగిన స్వరాజ్యమ్మగారు ఈరోజు మన మధ్య లేక పోవటం బాధాకరం! అమరావతిని రాజధానిగా సాధించుకున్నప్పుడే స్వరాజ్యమ్మగారి ఆశయాలు ఫలిస్తాయి. స్వరాజ్యమ్మగారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను(2/2)
— N Chandrababu Naidu (@ncbn) February 13, 2021











