అందరికి ఒక సమయం వస్తోంది ..!
తన తల్లి భువనేశ్వరిపై అసెంబ్లీలో విమర్శించిన ఒక్కరిని వదిలి పెట్టమని, సమయం అందిరికీ సమాధానం చెబుతోందని నారా లోకేశ్ వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అంతకు మించి అన్నట్లు మరో వార్నింగ్ ను కూడా ఇచ్చాడు లోకేశ్. తన తండ్రిలా మెతక వైఖరి తనది కాదని గట్టిగానే సమాధానం చెబుతా అని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. గౌరవం కోరుకునే కుటుంబ తమదని.. మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులపైనా ఎవరైన చిన్నతనం చేసి మాట్లాడితే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. వరదల సమయంలో ప్రజల్ని ఆదుకోవాల్సిన మంత్రులు ఎక్కడో ఉండి జల్సాలు చేస్తారని ఆరోపించారు. ప్రజలను ఆదుకునే తమపై నిందలు వేస్తారా? అని లోకేశ్ మండిపడ్డారు.
మంగళగిరి విస్తృత పర్యటన ..!
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గుంటూరు జిల్లా మంగళగిరిలో బుధవారం విస్తృతంగా పర్యటించారు. నియోజకవర్గంలో ప్రజల సమస్యలను అడిగి తెలుకున్నారు. ఇటీవల మరణించిన కార్యకర్తలు, నాయకులు ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుని, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్టారెడ్డిని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఉంటున్న నియోజకవర్గంలోనే అభివృద్ధికి దిక్కులేకపోతే, రాష్ట్రంలో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదని ఎద్దేవా చేశారు. చెత్త సీఎంల జాబితాలో దేశం లోనే జగన్ రెడ్డి నెంబర్ వన్ గా ఉన్నారని ధ్వజమెత్తారు.