యువగళం పాదయాత్ర రాజకీయాల్లో రాటుదేలేందుకు యువనేత లోకేశ్ కు ఎంతో ఉపయోగపడింది. అయితే వైసీపీ కుట్ర రాజకీయాలతో చంద్రబాబును అరెస్ట్ చేయించటంతో లోకేశ్ యువగళం పాదయాత్రకు కాస్త విరామం ప్రకటించారు. చంద్రబాబు అరెస్ట్ తో తెలుగుదేశం పార్టీని నడిపించే బాధ్యతను భుజాలపై వేసుకున్న లోకేశ్ విమర్శకుల నోళ్లు మూయించారు. తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించటానికి తనకున్న అర్హత లేమిటో అందరికి చాటి చెప్పారు. ఆధారాలేకుండా జగన్ సర్కార్ కుట్రపూరితంగా చంద్రబాబును అరెస్ట్ చేసిన వైనాన్ని జాతీయ రాజకీయ నేతలకు వివరించటంలోనూ లోకేశ్ చాణిక్య నీతిని ప్రదర్శించి అందరి ప్రశంలు పొందారు.
క్లిష్ట సమయంలో పార్టీని భుజాలపై వేసుకుని అందరినీ కలుపుకుపోతూ లోకేశ్ తండ్రికి తగ్గ వారసుడనిపించుకున్నారు. ఇదే సమకంలో తమతో కలసి వచ్చేందుకు అడుగులేస్తున్న జనసేనతోనూ లోకేశ్ సమన్వయం చేసుకుంటున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. చంద్రబాబు సూచనతో వ్యూహాత్మక సమావేశాలు ఎప్పటికప్పుడు కొనసాగిస్తూ పార్టీ యంత్రాంగాన్నిముందుకు నడిపిస్తున్నారు. ఉద్దండులు సైతం ఆశ్చర్యపడేలా వైసీపీ పక్షపాత మీడియా కుట్రలను సైతం తిప్పికొడుతో జనం నుంచి ప్రశంలు పొందుతూ లోకేశ్ యువళం పాదయాత్రను కొనసాగించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు.
2024 ఎన్నికలకు వైపు అడుగులే లక్ష్యంగా సాగుతున్న యువగళం పాదయాత్ర చంద్రబాబు అరెస్ట్తో అగిపోయినప్పటికీ ఆయన జైలు నుంచి బయటకు వచ్చేదాకా కొనసాగించాలని లోకేశ్ ఆలోచన. దీనిపై పార్టీ సీనియర్లతో జరిగే కీలక సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. పాదయాత్రలో అనుసరించాల్సిన వ్యూహాలు, చేయాల్సిన ప్రసంగాలే కాకుండా, బాబు అరెస్ట్ కోసం వైసీపీ అనుసరించిన మహా కుట్రను కూడా జనంలోకి తీసుకెళ్లటానికి లోకేశ్ సిద్ధమవుతున్నారు.
లోకేశ్ యువగళం పాతయాత్రకు తోడుగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా బస్ యాత్ర ప్రారంభించబోతున్నారన్న వార్త టీటీపీశ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. అధికార పార్టీ సైకో సిద్ధాంతాలను ఎండగట్టేందుకు ఇంతకటే మంచి తరుణం మరొకటి ఉండదన్న టీటీపీ రాజకీయ వ్యూహానికి అనుగుణంగా భువనేశ్వరి బస్సు యాత్ర సాగనుంది. గతంలో భువనేశ్వరి చాలా అరుదుగా రాజకీయ సభలు సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్ అయ్యాక ఆమె మీడియా ముందుకొచ్చిన తీరు, జగన్ ప్రభుత్వ మూర్ఖ వైఖరిని విమర్శించిన వైనం, ఆ తర్వాత పలురకాల నిరసన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జాతీయ మీడియాలో సైతం భువనేశ్వరి హైలైట్ అవటం తెలుగుదేశానికి కలిసొచ్చిన మరో అంశం. బాబు జైల్లో ఉన్న నేపథ్యంలో.. భువనేశ్వరి యాత్ర చేపడితే.. వైసీపీని ఎండగట్టడంతో పాటు.. పార్టీకి మైలేజ్ వస్తుందన్నది టీడీపీ యోచన.
అయితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అరెస్ట్ తర్వాత వ్యూహం మార్చటం, లోకేశ్ పాదయాత్ర ఆలోచన కు పదును పెట్టడం, భువనేశ్వరి బస్సు యాత్ర ప్రారంభించనుండతో జగన్ బ్యాచ్కు షాకుల మీద షాకులు తగిలినట్టయింది. బాబును అరెస్ట్ చేయించటం ద్వార తెలుగుదేశం పార్టీని ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అయిందని, అన్నీ కలసి తమ పార్టీని ఇరకాటంలో పడేశాయని జగన్ వర్గంతో పాటు ఆయన అనుకూల రాజకీయ వ్యూహ బృందాలు, సర్వే సంస్థలు, సొంత మీడియా సంస్థలు తలపట్టుకుంటున్నాయి. కౌంటర్ ప్లాన్లు రెడీ చేసుకునే లోపే వైసీపికి జరగాల్సిన డామేజ్ జరిగిపోయిందని అధికార పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.











