నీహారిక, చైతన్య హనీమూన్ ట్రిప్ లో సేదతీరుతున్నట్లు సోషల్ మీడియాలో ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. నవ దంపతులు త్వరలో హనీమూన్ ట్రిప్ కు వెళ్లనున్నట్లు కొద్ది రోజుల క్రితమే వార్తలొచ్చాయి కూడా. అందుకు అనుగుణంగానే మాల్దీవులకు హనీమూన్ ట్రిప్ వెళ్లారు. అక్కడి నీలి సముద్రం, పచ్చదనపు సోయగాలను ఆస్వాదిస్తూ ఎనలేని సంతోషంతో వారి ముఖాలు వెలిగిపోతున్నాయి.
ఇదిలావుండగా కళల పట్ల నీహారికకు ఉన్న అమితమైన ఇష్టం కారణంగా ముందు ముందు వెబ్ సిరీస్ నిర్మాతగా తన అభిరుచిని చాటుకోనున్నట్లు వినిపిస్తోంది. మంచి మంచి కథలను వెబ్ సిరీస్ లుగా తీయాలన్నది ఆమె ఆలోచన అని అంటున్నారు.
Also Read: రుచి చూసిన నీహారిక.. అన్న వంటకే జోహారిక!