కరోనా మహమ్మారి బాధితుల జాబితాలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా చేరారు. సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని సీఎస్ సోమేశ్ కుమార్ ప్రకటన చేసిన విషయం అందరికీ తెలిసిందే. డాక్టర్ల సూచన మేరకు కేసీఆర్ హోం ఐసోలేషన్ లో ఉన్నారు. అయితే కరోనా బారిన పడ్డ సీఎం కేసీఆర్, ఆస్పత్రిలో చేరాల్సిన అత్యవసర సమయం వస్తే, గాంధీలో మాత్రమే చేరాలని నెటిజన్లు కోరుతున్నారు. గాంధీలో అన్ని వైద్య సదుపాయాలు ఉన్నాయని, కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదని కేసీఆర్ గతంలో చెప్పారు. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ నేపథ్యంలో సీఎం గాంధీలో ట్రీట్ మెంట్ తీసుకొని, ప్రజలకు నమ్మకం కలిగించాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆయన పాత వీడియోలను షేర్ చేస్తూ.. తెలంగాణ గాంధీ.. గాంధీలో చేరుతారా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Must Read ;- 48 గంటల్లో తేల్చండి.. తెలంగాణ సర్కారుపై హైకోర్టు మరోసారి సీరియస్