టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ వివాహం గత నెల 30న కన్నుల పండుగగా జరిగిన సంగతి తెలిసిందే. కరోనా పాండమిక్ సిట్యుయేషన్స్ ను దృష్టిలో పెట్టుకొని పరిమిత ఆహ్వానితులు, ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఆమె పెళ్ళి అభిమానుల్ని ఎంతగానో ఆనందపరిచింది. వివాహానంతరం ఈ జంట పక్షులు హానిమూన్ విహరించాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఇద్దరూ మల్దీవ్స్ కు ఎగిరిపోయారు. వరించిన ప్రియుడితో కాజల్ ఎంచక్కా అక్కడ ఎంజాయ్ చేస్తూ..ఆ పిక్స్ ను తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసింది.
ఎర్రటి దుస్తుల్లో ధగధగలాడిపోతున్న చందమామ .. మాల్దీవ్స్ కే కొత్త అందాల్ని తెచ్చిపెట్టింది. సాగరతీరం బ్యాక్ డ్రాప్ లో ‘నీ కళ్ళు నీలిసముద్రం.. నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం’ అంటూ పాడపాడుతూ.. ఆమెను వెనుకనుంచి వాటేసుకొని నవ్వులు చిందిస్తూ .. రివీలయ్యాడు ఆమె భర్త గౌతమ్ కిచ్లూ. చూడముచ్చటగా ఉన్న ఈ జంటని చూసి.. మురిసిపోతున్నారు చందమామ అభిమానులు. అక్కడ దిగిన మూడు ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రస్తుతం కాజల్ చేతిలో ‘మోసగాళ్ళు, ఆచార్య, భారతీయుడు 2, ప్యారిస్ ప్యారిస్’ లాంటి ప్రాజక్ట్స్ ఉన్నాయి. హనీమూన్ కంప్లీట్ అవగానే… ఆమె వాటిని కంప్లీట్ చేసే పనిలో పడుతుంది. ఇందులో ముందుగా కాజల్ చిరంజీవి ‘ఆచార్య’ షూటింగ్ కోసం హైద్రాబాద్ లో ల్యాండ్ కానుంది. మరి ఈ సినిమాలన్నీ కంప్లీట్ చేయగానే.. తన అభిమానులకు ఇచ్చిన మాట ప్రకారం .. ఇంకా తన సినీ ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తుందో లేదో చూడాలి.