గవర్నర్తో తాను జరుపుతున్న ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ బయటకు లీకవుతుండటంపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్ అయ్యారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపాలంటూ నిమ్మగడ్డ హైకోర్టులో పిటిషన్ వేశారు. తాను గవర్నర్కు రాస్తున్న ప్రివిలేజ్ లెటర్స్ అన్నీ ఆ ఆఫీస్ నుంచి ఎలా బయటకు వస్తున్నాయో తేల్చాలన్నారు. తాను సెలవు పెడుతున్న విషయాలు కూడ బయటకు రావడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. గవర్నర్కు తాను రాసిన లేఖలను సోషల్ మీడియాలో చూశామని మంత్రులు చెబుతున్నారంటూ నిమ్మగడ్డ పిటిషన్లో ప్రస్తావించారు. గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎస్, మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సలను ఆయన ప్రతివాదులుగా చేర్చారు.
Must Read ;- సెలవులు రద్దు చేసుకున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ