కడపకు చెందిన వైసీపీ ఎన్నారై రాజకుమార్ రెడ్డి మద్యం మత్తులో జాత్యహంకార వ్యాఖ్యలు చేసి అమెరికాలో చెంపదెబ్బ కొట్టారు. ఆయన ఇలా చేయడం మొదటిసారి కాదు అని, ఇంతకు ముందు కూడా ఆయన మీద కేసులు ఉన్నటు తెలుస్తోంది.
అయితే వైసీపీ ఎన్నారైలకి ఈయన చీఫ్ అని తెలుస్తోంది. సీఎం జగన్పై సోషల్మీడియాలో పోస్టులు పెట్టినందుకు గాను ఓ ఎన్నారైని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు దాని వెనక ఉన్నది కూడా ఈ మహానుభావుడే అని తెలుస్తోంది.. పొందూరు కోటిరత్న అంజన్ను కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు అరెస్టు చేసి గురువారం సాయంత్రం అదనపు జూనియర్ సివిల్ జస్టిస్ శిరీష ఎదుట హాజరుపరిచారు.
అంజన్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్లు చేసి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రెండు వర్గాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
అంజన్ USAలో MS చదివాడు మరియు అక్కడ కొంతకాలం పనిచేశాడు. అతను భారతదేశానికి తిరిగి వచ్చి తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. అంజన్ యువ గళం పేరుతో ట్విట్టర్ ఖాతాను నడుపుతూ టీడీపీకి అనుకూలంగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం యెక్క అవినీతి, అరాచకాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా వైసీపీని ప్రశ్నిస్తున్నాడు.
అతని వెనుక టీడీపీ నేతలు ఎవరైనా ఉన్నారా, వారి నుంచి ఏమైనా లబ్ధి పొందుతున్నారా అని పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. అంజన్కు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ చేయవద్దని కోరినట్లు సమాచారం. ఇదంతా కూడా వైసీపీ ఎన్నారై రాజకుమార్ రెడ్డి అద్వర్యం లోనే జరిగిన్నటు తెలుస్తోంది. NRIలు ఎవరైనా ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించి అదికూడా వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెడితే రాజకుమార్ రెడ్డి మరియు ఆయన టీం రంగంలోకి దిగుతారని సమాచారం..