ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో అధికార వైసీపీ ఎలాగైనా తిరిగి అధికారం చేపట్టాలని బావిస్తోంది. రెండోసారి అధికారం చేటపట్టాలని భావిస్తున్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి కుట్రలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల వేళ రాష్ట్రంలో సామాజిక పింఛన్లను ఇవ్వకుండా ఆపేసి.. పింఛన్లు ఆగిపోవడానికి టీడీపీనే కారణమంటూ ప్రచారం చేస్తోంది. దీంతో టీడీపీతోపాటు.. ప్రతిపక్షాలు వైసీపీ కావాలని కుట్ర చేస్తోందని.. పింఛన్లను సక్రమంగా అమలు చేసేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల వేళ పింఛన్లను ఆపేసి.. అది ప్రతిపక్షాల వల్ల ఆగిపోయిందని ప్రచారం చేసుకుంటూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని వైసీపీ చూస్తున్నట్టు తెలుస్తోంది. దీనిని ప్రతిపక్షాలు గట్టిగా వ్యతిరేకిస్తూ.. ఎన్నికల కమిషన్ పింఛన్లను సక్రమంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఎన్నికల వేళ రాష్ట్రంలో సామాజిక పింఛన్ల పంపిణీలో వైసీపీ ప్రభుత్వం భారీ కుట్రకు తెరలేపిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నాలుగున్నరేళ్లుగా నడుస్తున్న ఇంటింటికీ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వమే అడ్డుకుని ఆ నెపాన్ని ప్రతిపక్ష టీడీపీపై నెట్టే ప్రయత్నం చేస్తోంది. పింఛన్ల పంపిణీని గ్రామ/వార్డు సచివాలయాలకే పరిమితం చేసి వృద్ధులతోపాటు దివ్యాంగులు, మహిళల్ని మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలోని సచివాలయాలకు వికృత రాజకీయ క్రీడను ప్రారంభించింది అధికార వైసీపీ. గిరిజన ప్రాంతాల్లోని పింఛనుదారుల్ని కొండలు, గుట్టలు ఎక్కించి వాగులు, వంకలు దాటించి మరింత ఇబ్బందులు పెట్టే దుర్మార్గానికి ఒడిగట్టింది. దీనంతటికీ ప్రతిపక్షాలే కారణమనేలా.. పింఛనుదారులందరిలో విషబీజాలు నాటడమే వైసీపీ సర్కారు ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. రాష్ట్రంలోని 15 వేలకు పైగా సచివాలయాల్లోని 1.35 లక్షల మంది గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు సునాయాసంగా ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నప్పటికీ.. కావాలనే జగన్ సర్కార్ కుటిల రాజకీయం చేస్తోందని ప్రతిపక్షాలు, పింఛన్ దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పింఛనుదారుల్ని సచివాలయాల దగ్గరకు రప్పించి నిరీక్షించేలా చేయాలని.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇబ్బందులు పెట్టి చంద్రబాబు కారణంగానే ఇలాంటి పరిస్థితొచ్చిందని వైసీపీ ప్రచారం చేసేలా అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు.
ఫించన్ పంపిణీకి సంబంధించి.. వాలంటీర్లు లేకపోయినా ఇంటింటికీ పింఛను పంపిణీ చేయడానికి సరిపడా ఉద్యోగులు గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉన్నారని ఎన్నికల సంఘానికి ప్రభుత్వ యంత్రాంగం ముందుగానే సమాచారం ఇచ్చిందని.. తీరా వాలంటీర్లను పక్కన పెట్టాలనే ఆదేశాలు వెలువడ్డాక అసలు వ్యూహాన్ని తెరపైకి తెచ్చిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సచివాలయాల వద్దనే పంపిణీ చేయాలంటూ సెర్ప్ సీఈఓ మురళీధర్రెడ్డి ఉత్తర్వులు ఇచ్చాకి.. అలా కాకుండా ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయాలని టీడీపీ డిమాండు చేయడంతో.. ఆఘమేఘాల మీద సచివాలయాల వద్దేనే పింఛన్ ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. పింఛన్ పంపిణీకి వాలంటీర్లను దూరంగా పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చేసరికి .. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘంపై దాడికీ వెనకాడటం లేదు జగన్ సర్కార్. వాస్తవానికి అమల్లో ఉన్న ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూ.. ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలి. ఈ విషయంపై ఎన్నికల సంఘం కూడా జోక్యం చేసుకుని ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రతిపక్ష టీడీపీతోపాటు కాంగ్రెస్, సీపీఐ, జనసేన, బీజేపీ డిమాండ్ చేస్తున్నాయి.