తానిక రాజకీయ వ్యూహకర్తగా ఉండనని ప్రశాంత్ కిషోర్ (పీకే) సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇంక తాను ఏ రాజకీయ పార్టీకి పని చేయనని చెప్పారు. తర్వాత ఏం చేయాలనేది తాను ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో పీకే బెంగాల్లో టీఎంసీకి, తమిళనాడులో డీఎంకేకు వ్యూహ కర్తగా వ్యవహరించారు. రెండు చోట్ల ఆయన పనిచేసిన రెండు పార్టీలు అధికారాన్ని కైవసం చేసుకుంటున్న తరుణంలో పీకే తన నిర్ణయాన్ని ప్రకటించడం ఆసక్తిని రేకిస్తోంది.
Must Read ;- ఆ రాష్ట్రాల్లో అధికారం వారిదే: ఎగ్జిట్ పోల్స్..











