ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, ఊహించనివిధంగా రాజకీయ ఎంట్రీ ఇద్దామనుకున్న వైఎస్ షర్మిలకు పోలీసులకు షాక్ ఇచ్చారు. సభకు అనుమతులు ఇచ్చినట్టే ఇచ్చి మెలిక పెట్టారు. బహిరంగ సభకు అనుమతులిచ్చిన పోలీసులు, కోవిడ్ నిబంధనల కారణంగా షరతులు విధించారు. దీంతో షర్మిలకు ఆదిలోనే హంసపాదు ఎదురైనట్లయింది. ఖమ్మంలో వచ్చే నెల 9న సంకల్ప సభ పేరుతో భారీ బహిరంగ సభకు సిద్ధమయ్యారు. సభకు అనుమతుల కోసం ఇప్పటికే పోలీసులకు దరఖాస్తు కూడా చేసుకున్నారు.
అయితే పోలీసులు సభకు అనుమతులు మంజూరు చేసినప్పటికీ.. కోవిడ్ ప్రభావం కారణంగా ఆంక్షలు విధించడం చర్చనీయాంశంగా మారింది. కేవలం 6 వేల మందితో మాత్రమే సభ నిర్వహించుకోవాలని ఇచ్చినట్లు తెలుస్తోంది. కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించుకోవాలని షరత్తు విధించారు. కనీసం లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలనుకున్న షర్మిల, పోలీసుల షరతుల కారణంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే…
Also Read:ఆర్థిక దన్నుతో ఫుల్ ఎఫర్ట్స్.. పక్కా ప్లానింగ్తో షర్మిల












