తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు కసరత్తులు చేస్తున్న షర్మిలకు ఆమె తల్లి విజయమ్మ తనవంతు సహకారం చేస్తున్నట్లు తెలుస్తోంది. షర్మిల జిల్లాల వారీగా నేతలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. వైఎస్ హయాంలో సీఎంఓలో పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు విజయమ్మ ఫోన్లు చేసి షర్మిలకు పార్టీ ఏర్పాటు వ్యవహారాల్లో సహకరించాలని కోరుతున్నట్లు సమాచారం. అంతేగాక నమ్మకస్తులైన తెలంగాణ రాజకీయ నాయకులతోనూ ఆమె మాట్లాడుతూ షర్మిలకు సహకరించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.
Must Read ;- షర్మిల నోట ‘జై తెలంగాణ’.. 11 అంశాలపై అభిప్రాయ సేకరణ











