కరోనా కారణంగా థియేటర్లు మూతపడడం తెలిసిందే. మార్చి నుంచి థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే థియేటర్లు రీ ఒపెన్ అవుతున్నాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న సాయిధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటరు రిలీజ్ కానుంది. ప్రభుత్వం థియేటర్స్ రీ ఓపెన్ కి అనుమతి ఇచ్చింది కానీ.. 50 శాతం ఆక్యూపెన్సీకి మాత్రమే అనుమతి ఇచ్చింది. దీంతో అసలు జనాలు థియేటర్ కి వస్తారా..? ఒకవేళ వచ్చినా 50 శాతం ఆక్యూపెన్సీతో రన్ చేస్తే లాభాలు వస్తాయా.? ఇలా అనేక అనుమానాలు. అయితే.. సోలో బ్రతుకే సో బెటరు సినిమా ముందడుగు వేసింది.
ఈ నెల 25న ధియేటర్లోకి వస్తుంది. ఇండస్ట్రీ అంతా ఈ సినిమాకి కలెక్షన్స్ ఎలా ఉంటాయని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ లో అన్ని చోట్ల దాదాపుగా మల్టీప్లెక్స్ లు రీ ఓపెన్ చేశారు. ప్రసాద్ ఐమాక్స్ -ఎఎంబి సినిమాస్ వంటి స్క్రీన్స్ చాలా గ్యాప్ తర్వాత ఓపెన్ చేసారు. దీంతో సెలబ్రిటీలు రంగంలోకి దిగి థియేటర్లో సినిమా చూడమని ప్రచారం చేస్తున్నారు. ఇంతకు ముందు నాగచైతన్య, సుశాంత్, నిఖిల్, విష్వక్ సేన్, డైరెక్టర్ మారుతి తదితరులు థియేటర్స్ ని సపోర్ట్ చేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రంగంలోకి దిగారు. మన సినిమాని బిగ్ స్క్రీన్ లో ఎక్స్పీరియన్స్ చేద్దాం అని ప్రభాస్ చెప్పిన వీడియోను రిలీజ్ చేసారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విధంగా సినీ ప్రముఖులు థియేటర్లో సినిమా చూడమని ప్రచారం చేస్తున్నారు. మరి.. ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
Must Read ;- ప్రభాస్ సినిమాలో మోహన్ లాల్ అంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారా?











