ఒక్కరోజులో మూడు ప్రాంతాలను చుట్టి కరోనా వ్యాక్సిన్ పురోగతి గురించి స్వయంగా తెలుసుకోవాలిని ప్రధాని నిర్ణయించుకున్న సంగతి తెలిసందే. అందులో భాగంగా మొదట అహ్మదాబాద్ లో ని జైడస్ బయోటెక్ పార్క్ ని సందర్శించి, వ్యాక్సిన్ పురోగతిని పరిశీలించారు. తిరిగి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ లోని హకీంపేట వైమానిక స్ధావరానికి చేరుకున్నారు. అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా భద్రతా బలగాల వలయంలో కోవ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్న భారత్ బయోటెక్ కు చేరుకున్నారు.
అభినందనీయం
భారత్ బయోటెక్ లోని పరిస్థితులను పరిశీలించిన మోడీ, అక్కడ ప్రయోగాల గురించి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ పురోగతి, పనితీరు గురించిన వివరాలను నిశితంగా పరిశీలించినట్టు సమాచారం. అనంతరం భారత్ బయోటెక్ పర్యటన వివరాలు తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘భారత బయోటెక్ లో కొవిడ్-19 వ్యాక్సిన్ గురించిన వివరాలు తెలియజేశారు. వ్యాక్సిన్ తయారీలో శాస్త్రవేత్తల కృషికి నా అభినందనలు. వారు ఐసిఎంఆర్ తో సమన్వయ పరుచుకుంటూ పనిచేస్తున్నారు. టీకాను వీలైనంత తొందరగా అందుబాటులోకి తేవడానికి తమ వంతు ప్రయత్నిస్తున్నారు’ అంటూ తన హైదరాబాద్ టీకా పర్యటన విజయవంతమైనట్లుగా తెలియజేశారు మోడీ.
At the Bharat Biotech facility in Hyderabad, was briefed about their indigenous COVID-19 vaccine. Congratulated the scientists for their progress in the trials so far. Their team is closely working with ICMR to facilitate speedy progress. pic.twitter.com/C6kkfKQlbl
— Narendra Modi (@narendramodi) November 28, 2020
2021 కి టీకా సిద్ధమవుతుంది
ప్రస్తుతం కోవ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ప్రయోగాన్ని రికార్డు స్థాయిలో దాదాపు దేశంలో 25 ప్రాంతాలను ఎంచుకుని 25000 నుండి 26000 వాలంటీర్లపై ప్రయోగం చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అది ప్రయోగ దశలో ఉంది. ఈ ప్రయోగం విజయవంతం అయితే దాాదాపు ప్రయోగం చివరి దశకు చేరకున్నట్లే అని చెప్పచ్చు. అనుకున్నవి అనుకున్న ప్రకారం జరిగితే, 2021 లో టీకా విడుదలకు సిద్ధమవుతున్నట్లు భారత్ బయోటెక్ అధినేత క్రిష్ణ ఎల్లా గతంలోనే ప్రకటించారు.











