ఓట్టేసిన వారికి ఓదార్పు కరువు?
నెల్లూరుల్లో పెన్నా పొంగింది … 40 వేల మంది రోడ్డును పడ్డారు. అయితే అధికారపార్టీలో (గ్రామ) సింహాలుగా చెప్పుకునే వారు ఎక్కడా? అని ప్రజలు నిలదీస్తున్నారు. విపక్షాలు అధికారపార్టీ నాయకులపై, ప్రభుత్వ వైఫల్యాలపై పల్లెత్తు మాట్లాడినా … పెద్దనోర్లేసుకుని విరుచుకుపడే వీరు … నెల్లూరు పునరావస కేంద్రాల్లో సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్న బాధితుల గోడు ఎందుకు వినిపించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. చేతికందిన పంట పెన్నా నదిలో వరదల్లో కొట్టుకుపోతే .. ఇద్దరు మంత్రులు జిల్లాలో ఉండి .. రైతును అక్కును చేర్చుకులేని బిజీ పనుల్లో మునిగి తేలుతుంటే వారినేమనాలి? ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి దౌర్భగ్య పరిస్థితులు గతంలో ఏ ప్రభుత్వంలో చూడలేదని మంత్రులపై, ఎమ్మెల్యేలపై వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో పూర్తిగా వరదనీరు ముంచెత్తింది. ఈ క్రమంలో ఓట్లేసి గెలిపించిన మంత్రి మేకపాటి గౌతం, ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ లు ఆయా ప్రాంతాల్లో పర్యటించిన పాపాన పోలేదు. అలానే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సిటీ ఎమ్మెల్యే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఒక్కరోజు ఏదో అలా పర్యటించి మమ అనిపించుకున్నారు. నేటికి వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు వారికి పట్టడంలేదు అన్నది వాస్తవం. ఇక ఇన్ చార్జి మంత్రి బాలినేని, ఎంపీ ఆదాల పరిస్థితి అయితే ఇంకా దారుణం. ఒక్కరోజు కూడా జిల్లాలో నేటికి పర్యటించకపోవడం శోచనీయం.
ప్రతిపక్షాలకున్న స్పూర్తి.. అధికార పార్టీకి లేదా!
రాష్ట్రంలో కురిసిన భారీవర్షాలకు తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్, జనసేన పార్టీలు స్పందించాయి. ప్రజలకు అందుబాటులో ఉండి ఆహారం, తాగునీరు, మందులు అందజేసి, యుద్ధప్రాతిపదిన ఆదుకోవాలని పిలుపునిచ్చాయి. విపక్షాలుకున్న కనీస ఇంగితజ్ఞానం జగన్ రెడ్డి ప్రభుత్వానికి లేదని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చిన్నారులకు పాలు, బ్రెడ్స్, మందులను అందజేయాలని చంద్రబాబు కార్యకర్తలను ఆదేశించారు. అలానే ఆహార పొట్లాలను అందజేసి ఆకలి తీర్చాలని సూచించారు. మొత్తంగా నెల్లూరు జిల్లాలో ఆశ్రయం, ఆధరణ, అక్కున చేర్చుకునే వారులేక దిక్కుతోచని స్థితి వరద బాధితులు గత నాలుగు రోజులుగా మగ్గుతున్నారు. ఇప్పటికైనా మేల్కొని నెల్లూరు జిల్లా వరద బాధితులను ఆదుకోవాలని టీడీపీ నాయకులు లోకేష్ డిమాండ్ చేస్తున్నారు.