మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నాం – సీఎం జగన్
విస్తృత, విశాలయైన ప్రయోజనాలను కాపాడేందుకే .. మూడు రాజధానులను బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని సీఎం జగన్ రెడ్డి స్పష్టం చేశారు. సమగ్రమైన వికేంద్రీకరణ బిల్లును సభ తిరిగి ప్రవేశపెట్టతాం వివరించారు. ఎటువంటి పరిస్థితులో మూడు రాజధానులను ఏర్పాటు చేయాల్సి వచ్చిందో ఆయన అసెంబ్లీలో వివరించారు. అమరావతి ప్రాంతంపై నాకు వ్యతిరేకత లేదు … ప్రేమ కూడా ఉంది ….. నా ఇళ్లు కూడా ఇక్కడే ఉందని జగన్ రెడ్డి చెప్పుకొచ్చారు. రాజధాని అమరావతిలో బేసిక్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కు లక్షల కోట్లు ఖర్చు అవుతోంది. పదేళ్లు పోతే ఆరు లక్షల కోట్లు అయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని జగన్ అభిప్రాయపడ్డారు. కరెంటు, డ్రైనేజ్ , రోడ్ల నిర్మాణాలకు డబ్బులు లేవు… అందుకే విశాఖలో పూర్తి ఇన్ఫా అభివృద్ధి చెంది ఉంది కాబట్టే రాజధానిని విశాఖ లో ఏర్పాటు చేయాలని భావించాం .. అలానే శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూల్లో హైకోర్టును ఏర్పాటు చేశాం ..అని జగన్ పునరుద్ఘాటించారు.
అందుకే వెనక్కి తగ్గాం …
మూడు రాజధానుల విషయం వైసీపీ కట్టుబడి ఉంది. అనేక అపోహలు, కోర్టు కేసులు, దుస్ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అందుకే నేడు బిల్లును ఉపసంహరించుకుంటున్నామని జగన్ రెడ్డి, ఆయన మంత్రులు మీడియాకు వివరించారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ను సరిచేసుకుని తిరిగి మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతాం అని చెప్పారు. అయితే గతంలో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టి రెండేళ్లు కావస్తోంది .. నేటికి రాజధానులను ఇంత వరకు నిర్మించలేదు …. తిరిగి సమగ్ర, మెరుగైనా బిల్లుతో వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెడతాం అని చెబుతున్నారు .. మరి అభివృద్థి ఎప్పుడు చేస్తారని ప్రశ్నించిన మీడియా పై మంత్రి బొత్స విరుచుకుపడ్డారు. టీడీపీ మాటాలు మా వద్ద చెప్పకండి … గ్రాంథిక భాషలో ప్రశ్నలు అడగకండి … తెలుగు మాట్లాడండి అని నిరుత్సాహం వ్యక్తం చేశారు.