రెబల్ స్టార్ ప్రభాస్, అందాల పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న రొమాంటిక్ థ్రిల్లర్ ‘రాధేశ్యామ్’. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ఇటలీలో చిత్రీకరణ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. దాదాపు మూడు వారాలుగా చిత్ర బృందం అక్కడే క్యాంప్ వేసింది. ప్రస్తుతం ప్రధాన తారాగణంపై కీలకమైన సన్నివేశాల షూట్ జరుగుతోంది. ఇటలీ షెడ్యూల్ సినిమాకే హైలైట్ కానుందని సమాచారం.
తాజా సమాచారం ప్రకారం ఈ వారంతం వరకూ ‘రాధేశ్యామ్’ చిత్రీకరణ జరగనుందట. దీంతో ఇటలీ షెడ్యూల్ కంప్లీట్ అవుతుందట. కొద్ది రోజుల్లోనే ‘రాధేశ్యామ్’ యూనిట్ హైద్రాబాద్ లో ల్యాండ్ అవుతుందని తెలుస్తోంది. కొద్ది రోజుల గ్యాప్ తర్వాత సినిమా తదుపరి షెడ్యూల్ హైద్రాబాద్ లో మొదలవుతుందట. అన్ లాక్ తర్వాత ‘రాధేశ్యామ్’ షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకోవడం ఆసక్తిగా మారింది.
గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ‘రాధేశ్యామ్’ మూవీ.. పాన్ ఇండియా కేటగిరిలో బహుభాషల్లో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇక ఈ సినిమా ట్రైలర్, సింగిల్స్ విడుదలయితే.. మరింత హైపు క్రియేట్ అయ్యే అవకాశాలున్నాయి. సాహో తర్వాత ప్రభాస్ నటిస్తోన్న సినిమా కాబట్టి.. ఈ సినిమా విడుదల కోసం కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురుచూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ . మరి రాధేశ్యామ్ సినిమా ప్రభాస్ కు ఇంకా ఏ రేంజ్ లో క్రేజ్ తెస్తుందో చూడాలి.