తెలుగు సినిమాను కమర్షియల్ బాటపట్టించిన దర్శకుల్లో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చాలా ప్రత్యేకం. నాటి తరం టాప్ హీరోల నుంచి నిన్న మొన్నటి యంగ్ హీరోల వరకూ ఆయన ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ తీశారు. అలాగే.. చిరంజీవి, బాలయ్య , వెంకీ, నాగార్జున లాంటి హీరోలకి ల్యాండ్ మార్క్ మూవీస్ అందించారు. అయితే ఆయన కొంతకాలంగా కమర్షియల్ బాణీని వీడి .. భక్తి మార్గం పట్టిన సంగతి తెలిసిందే. నాగార్జున తో ‘అన్నమయ్య, శ్రీరామదాసు, షిర్డీసాయి, ఓం నమో వెంకటేశాయ’ లాంటి సినిమాలు తీసి.. సత్తా చాటుకున్నారు. ఆయన ఆఖరుగా తీసిన సినిమా ‘ఓం నమో వెంకటేశాయ’. రెండేళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయింది.
మళ్ళీ ఇన్నాళ్ళకి రాఘవేంద్రరావు నుంచి సినిమా అనౌన్స్ మెంట్ రానుంది. ఆయన ట్విట్టర్ అకౌంట్లో అక్టోబర్ 9న ఉదయం 11.30 నిమిషాలకు తన ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక సినిమా వార్త ప్రకటించబోతున్నట్టు తెలిపారు. సన్నిహితుల్ని ఆ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ.. చిన్న వీడియో రూపంలో పోస్ట్ చేశారు. ‘ఓం నమోవెంకటేశాయ’ సినిమా తర్వాత ఆయన తదుపరి సినిమాకి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ ఇన్నాళ్టికి అది ఇప్పుడు సాధ్యమైంది. అయితే ఇప్పుడు ఆయన తీయే బోయే సినిమాకి ఆయన దర్శకుడా? నిర్మాతా అన్న విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఇంతకు ముందు నాగశౌర్య, మరికొందరు పేరున్న నటీనటులతో క్రిష్, ఇంకో ఇద్దరు దర్శకులతో ఓ మల్టీస్టారర్ మూవీ చేద్దామని అనుకున్నారు రాఘవేంద్రారావు. దానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అదెందుకో కానీ కార్యరూపం దాల్చలేదు. మరి ఇప్పుడు ఆయన చేయబోయేది ఏ సినిమా అవుతుంది? అన్న విషయం తెలియాలంటే.. రేపటి వరకూ ఆగాల్సిందే.
Stay tuned.. pic.twitter.com/16uMDrNHbf
— Raghavendra Rao K (@Ragavendraraoba) October 7, 2020