కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఒకే ఒక్క ట్వీట్.. రాజకీయంగా హీటు పెంచింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల వేళ.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటే.. ‘‘ప్రపంచంలో చాలా మంది నియంతల పేర్లు ‘ఎం’ అక్షరంతోనే మొదలవుతున్నాయి. ఎందుకో?’’ ఇది.. ఆ ట్వీట్ సారాంశం. దీనికి జతగా.. మార్కస్, ముస్సోలినీ, మిలోసెవిక్, ముబారక్, మొబుతు, ముషార్రఫ్, మికోంబెరో.. ఇలా.. ఈ ఏడు పేర్లను ఉదహరించారు.
Why do so many dictators have names that begin with M ?
Marcos
Mussolini
Milošević
Mubarak
Mobutu
Musharraf
Micombero— Rahul Gandhi (@RahulGandhi) February 3, 2021
దీంతో.. ఈ ట్వీట్ ఒక్కసారిగా వైరలైంది. రాహుల్.. తన ట్వీట్ లో మోదీ పేరును ప్రత్యక్షంగా పేర్కొనక పోయినా.. ఈ ట్వీట్ చూసిన అందరికీ ఎనిమిదో వ్యక్తి మోదీనే అని అర్థమవుతుంది. అందుకే ఇది సంచలనంగా మారింది. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్ నడుస్తోంది. మోదీ పేరు ‘ఎం’తో మొదలవుతుందంటూ ఒకరు విమర్శిస్తుంటే.. మన్మోహన్ పేరు ఎందుకు కాకూడదంటూ మరొకరు ప్రశ్నిస్తున్నారు. ఇలా.. రెండు వర్గాల కార్యకర్తలూ ఒకరిపై ఒకరు దుమ్మొత్తి పోసుకుంటున్నారు. ఈ రగడ చిలికి చిలికి గాలీవానలా మారి రెండు పార్టీల మధ్య వాగ్యుద్ధానికి దారితీస్తుందేమో చూడాలి.
Must Read ;- గేరు మారుస్తున్న మేడం.. ప్రతిపక్షాల దన్నుతో కేంద్రంపై పోరాటం











