కోవిడ్ 19.. 2020 సంవత్సరానికే కోలుకోలేని దెబ్బకొట్టింది. అన్ని రంగాల్లోనూ తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా సినిమా రంగం.. ఇప్పుడప్పుడే బతికి బట్టకట్టే పరిస్థితి లేకపోవడంతో .. నిర్మాతలందరూ దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఇటు సినిమాల షూటింగ్స్ జరక్కా.. అటు థియేటర్స్ తెరవక… ఈ ఏడాది రిలీజ్ ముంగిట ఆగిన చిత్రాలు ఓటీటీని ఆశ్రయించడం తప్పనిసరైపోయింది. ఇప్పటికే కొన్ని చిన్న చిత్రాలు ఓటీటీలో విడుదలై.. కాస్తో కూస్తో ఊపిరి పీల్చుకోగా … త్వరలో పలు మినిమమ్ రేంజ్ మూవీస్ సైతం ఓటీటీ లో విడుదలకు సిద్ధమవుతున్నాయని సమాచారం.
ఈ లిస్ట్ లో ముందువరుసలో ఉన్న సినిమా నానీ,సుధీర్ బాబు, ఇంద్రగంటి థ్రిల్లర్ మూవీ ‘వి’. నిజానికి ఈ సినిమా ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. లాక్ డౌన్ లేకపోతే.. ఈ ఉగాదికే విడుదలయి ఉండేది. కరోనా వైరస్ ఎఫెక్ట్ తో .. అప్పట్లో విడుదల వాయిదా వేసుకుంది ‘వి’ సినిమా. అయితే ఇప్పుడప్పుడే థియేటర్స్ తెరుచుకొనే పరిస్థితులు కనిపించకపోవడంతో.. మేకర్స్ ఈ సినిమాను ఓటీటీలోనే విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుందని టాక్. ఆ మేరకు అమెజాన్ తో రూ.30కోట్ల డీల్ మాట్లాడుకున్నారట. ఇక ఈ సినిమా తర్వాత లైన్ లో ఉన్న సినిమా రామ్ పోతినేని ‘రెడ్’. తమిళ చిత్రం ‘తడం’ రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా కూడా త్వరలో ఓటీటీలో విడుదల కానుందని సమాచారం. ఇక అనుష్క ‘నిశ్శబ్దం’, రానా దగ్గుబాటి ‘అరణ్య’, వైష్ణవ్ తేజ ‘ఉప్పెన’ సినిమాలు కూడా త్వరలో ఓటీటీలో విడుదల కానున్నాయట. అయితే అవి ఏ ఓటీటీలో డీల్ కుదుర్చుకున్నాయనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. నిజానికి నిశ్శబ్దం, అరణ్య చిత్రాలు ఏప్రిల్ 2న విడుదల కావాలి. ఆ తర్వాత రామ్ పోతినేని రెడ్ సినిమా ఏప్రిల్ 9న విడుదల కావాలి. కానీ.. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమాల విడుదల తేదీలు కూడా వాయిదా వేసుకున్నాయి. మరి ఈ సినిమాలు ఓటీటీలో విడుదలై.. ఏ రేంజ్ లో సక్సెస్ సొంతం చేసుకుంటాయో చూడాలి.
జగన్కి ప్రభాస్ ఫ్యామిలీ షాక్..?? తాడేపల్లి ప్యాలెస్కి మెస్సేజ్..!!
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యామిలీ వైసీపీ అధినేత జగన్కి ఝలక్...