హెడ్డింగ్ చూసి.. ఏదో ఏదో ఊహించేసుకోకండి. ఇక్కడ అంత ఇమేజినేషన్ కు స్కోప్ లేదు. విషయం ఒక సినిమాకు సంబంధించిందే. మలయాళ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్.. వెర్సటైల్ డైరెక్టర్ ప్రియదర్శన్ కలయికలో త్వరలో రానున్న సినిమా కు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్టేట్ ఇది. లాక్ డౌన్ లేకపోతే.. ఈ మార్చ్ లోనే విడుదల కావాల్సిన సినిమా అది. పేరు ‘మరక్కార్ : అరబ్బిక్కడలిండే సింహం’. 16వ శతాబ్దానికి చెందిన ముస్లీమ్ నేవీ ఆఫీసర్ ‘కుంజాలీ మరక్కార్ 4’ సాహసోపేతమైన జీవిత చరిత్ర ఈ సినిమా కథాంశం. ఒక రకంగా దీన్ని బయోపిక్ అనే అనాలి. మోహన్ లాల్ టైటిల్ రోల్ పోషిస్తుండగా… ప్రియదర్శన్ ఆ సినిమాను తెరకెక్కించాడు. ప్యాన్ ఇండియా కేటగిరిలో .. బహుభాషల్లో .. దాదాపు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమయింది. ప్రపంచవ్యాప్తంగా 5వేల థియేటర్స్ లో విడుదల చేయాలని ప్లాన్. కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది.
అసలు మేటర్లోకి వస్తే…. ఇందులో హీరో మోహన్ లాల్ ప్రేమలో పడే ఘట్టముంది. ఆయేషా అనే ఒక అందమైన అమ్మాయితో కుంజాలి మరక్కార్ తన టీనేజ్ లో లవ్ లో పడతాడట. అప్పుడొచ్చే ఎపిసోడ్ లో యంగ్ మరక్కార్ గా మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ , అతడికి జంటగా.. ఆయేషాగా ప్రియదర్శన్ కూతురు కళ్యాణి ప్రియదర్శన్ కేమియో రోల్స్ పోషించారు. హలో , చిత్రలహరి, రణరంగం తెలుగు సినిమాల్లో కళ్యాణి కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అమ్మడు హీరో అనే తమిళ సినిమాలో కూడా నటించింది. అయితే ఇక్కడో విశేషమేంటంటే.. అమ్మడు దీని తర్వాతనే మలయాళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అది కూడా మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘వరణే ఆవశ్యముండు’ అనే మూవీలో. సో.. మొత్తం మీద మోహన్ లాల్ తో అత్యధిక చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రియదర్శన్ … ఇప్పుడు ఆయన కొడుకు ను కూడా డైరెక్ట్ చేశాడన్నామట. మరి హీరోగారబ్బాయి, డైరెక్టర్ గారి అమ్మాయి ఈ సినిమాతో ఏ రేంజ్ లో పేరు తెచ్చుకుంటారో చూడాలి.
జగన్కి ప్రభాస్ ఫ్యామిలీ షాక్..?? తాడేపల్లి ప్యాలెస్కి మెస్సేజ్..!!
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యామిలీ వైసీపీ అధినేత జగన్కి ఝలక్...