జేఏసీ నేతలపై ఆర్టీసీ ఆగ్రహం..
‘‘కొత్త పీఆర్సీ విషయంలో, ఉద్యోగులు ఆశించిన దానికన్నా ఎక్కువ చేసి ఉండాల్సింది’’ అని రాష్ట్ర ముఖ్యమంత్రే ఒప్పుకుంటుంటే.. వంచన గురై, హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యోగుల తరుఫున జేఏసీ నేతలు మంత్రుల కమిటీకి, సజ్జలకు క్షమాపణ చెప్పడం ఎంత మేరకు ఒప్పుకోం అని ఆర్టీసీ సిబ్బంది మండిపడుతున్నారు. ఉద్యమానికి ఆర్టీసీ ఆక్సిజన్ లాంటిదని, ప్రభుత్వ మెడలు వంచేందుకు ఒస్సులు ఆపిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో ఆర్టీసీ సమస్యలను పక్కన పెట్టిమరి, మంత్రుల కమిటీ ప్రతిపాదించిన అంశాలకు స్టీరింగ్ నేతలు తలలు ఊపారని మండిపడ్డారు. ఎన్ఎంయూ, ఈయూలతో ఇతర సంఘాల నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రివర్స్ పీఆర్సీ, హెచ్ఆర్ఏ కోత, ఇతర సమస్యలపై ఉద్యోగ సంఘాల నేతలు ఎన్నడూ ఒక మాట మాట్లాడలేదని, సోషల్ మీడియాలో ఉద్యోగులు నిలదీయడంతో సమ్మె నోటీసు ఇచ్చారని విమర్మించారు.
పోరాటాలను తాకట్టుపెట్టి..
ఉద్యోగ, ఉపాధ్యాయ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఉపాధ్యాయ సంఘాలు కీలక పాత్రపోషిస్తే.. ఆ పోరాటాన్ని అర్థరాత్రి తాకట్టు పెట్టారని ఆర్టీసీ సిబ్బంది మండిపడ్డారు. ఆర్టీసీ, టీచర్ల సంఘాలతో చర్చించి మరో దఫా చర్చలకు వస్తామని చెప్పకుండా ఎన్జీవో నేతలు రాజీపడటంలో ఏం తాయులాలున్నాయో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. జేఏసీలో ఈయూ రాష్ట్ర అధ్యక్షడు వైవి రావు ఉన్నప్పటికీ ఆర్టీసీ సమస్య ఒక్కటైనా చర్చల్లో ఎందుకు ప్రస్తావించి పరిష్కారానికి చొరవ చూపలేదని నిలదీస్తున్నారు. టీచర్లతో కలిసి సమస్యల సాధనకు ఎన్ఎంయూ, ఈయూ, ఇతర ఆర్టీసీ సంఘాలు ఉద్యమించాలని నిర్ణయించుకున్నారు ఏపీ ఆర్టీసీ సిబ్బంది!