ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీకి మరో సావిత్రి సౌందర్య. అందమైన అభినయంతో సంసార పక్షమైన పాత్రలకు చిరునామాగా నిలిచింది . అప్పటి అందరు అగ్రతారల సరసన దక్షిణాది భాషలన్నిటిలోనూ అభినయించి సత్తా చాటుకున్న ఆమె .. అంతలోనే అనంతలోకాలకి పయనమైపోయింది. ఆమె లేని లోటు సౌత్ ఇండస్ట్రీకి ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. అందుకే ఆమె జీవిత చరిత్రను సినిమా గా తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఒక ప్రముఖ దర్శకుడు సౌందర్య బయోపిక్ ను భారీ ఎత్తున తీయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారట.
అయితే సౌందర్య బయోపిక్ లోని ప్రధాన పాత్ర కోసం సౌత్ టాలెంటెడ్ నటీమణి సాయిపల్లవిని ఎంపిక చేశారని తెలుస్తోంది. సహజనటిగా సౌందర్య సాధించిన విజయాలు , ఆమె పోషించిన గొప్పపాత్రలు ఈ సినిమాకి ప్రధాన అంశాలు కానున్నాయని సమాచారం. అలాగే.. ఇందులో సౌందర్య హీరోయిన్ గా మారే క్రమంలో పడిన కష్టాలు, ఆమె నిర్మాతగా మారడం కూడా ఉండబోతున్నాయట. మరి సాయిపల్లవి సౌందర్య పాత్రకి ప్రాణం పోసేందుకు ఎప్పుడు రెడీ అవుతుందో వేచి చూడాలి.