సూపర్ స్టార్ మహేష్ బాబు – ‘గీత గోవిందం’ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా చాలా సార్లు వాయిదాపడి ఆఖరికి జనవరి 25న సెట్స్ పైకి వెళ్లింది. అమెరికాలో షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. దుబాయ్ లో షూటింగ్ స్టార్ట్ చేశారు. దాదాపు నెల రోజుల పాటు అక్కడే షూటింగ్ చేయనున్నారు.
అయితే.. ఇప్పుడు వరుసగా భారీ సినిమాల రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేస్తుండడంతో సమ్మర్ కి రానున్న సినిమాలు ఫిక్స్ అయ్యాయి. అలాగే దసరాకి ఆర్ఆర్ఆర్ వస్తుండడంతో ఏ సినిమా కూడా దసరాకి రిలీజ్ చేసే సాహసం చేయదు. అందుకనే అల్లు అర్జున్ పుష్ప సినిమాని ఆగష్టు 13న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించి డేట్ కన్ ఫర్మ్ చేసుకున్నాడు. బన్నీ పుష్ప రిలీజ్ డేట్ కన్ ఫర్మ్ అయిన తర్వాత అందరి దృష్టి మహేష్ ‘సర్కారు వారి పాట’ పైనే ఉంది.
ఆఖరికి మహేష్ సర్కారు వారి పాటను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టుగా ట్విట్టర్ ద్వారా ఎనౌన్స్ చేశారు. 2020 సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా రిలీజైంది. 2022 సంక్రాంతికి ‘సర్కారు వారి పాట’ రానుంది. అంటే.. 2021లో మహేష్ నటించిన ఒక్క మూవీ కూడా రిలీజ్ కావడం లేదు.
Must Read ; మహేష్ కు బాగానే ‘వర్కవుట్’ అవుతున్నట్టుంది!
Sankranthi it is!!! 😊 #SarkaruVaariPaata @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @GMBents @14ReelsPlus @MythriOfficial pic.twitter.com/QkwE7glZTa
— Mahesh Babu (@urstrulyMahesh) January 29, 2021











