సంచలనం సృష్టించిన అమ్నేషియా రేప్ కేసులో పోలీసులు నిజాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న చంచల్ గూడా జైలులో ఉన్న సాదుద్దీన్ ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, తొలిరోజు విచారణలో సాదుద్దీన్ పోలీసులకు సహకరించలేదు. రెండో రోజు విచారణలో భాగంగా ఈరోజు జువైనల్ హోమ్ లోనే పోలీసులు మైనర్ లను ప్రశ్నించానున్నారు.
అత్యాచార ఘటనలో విచారణ ముమ్మరం చేసిన పోలీసులు తొలిరోజు విచారణలో నిందితుడు సాదుద్దీన్ ను 6 గంటల పాటు ప్రశ్నించారు.మొదటి రోజు విచారణలో సాదుద్దీన్ పోలీసులకు సహకరించలేదు. పోలీసుల ప్రశ్నలకు సమాధానం దాటవేస్తూ వచ్చాడు.దీంతో విచారణ అనంతరం సాదుద్దీన్ ఇచ్చిన స్టేట్మెంట్ ను మాత్రమే పోలీసులు రికార్డు చేశారు.కాగా ఈరోజు మళ్ళీ సాదుద్దెన ను పోలీసులు విచారించనున్నట్లు సమాచారం.
ఇక రెండో రోజు విచారణలో భాగంగా కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు మైనర్ లను సైతం పోలీసులు ప్రశ్నించనున్నారు.ఐదు రోజుల పాటు మైనర్ లను విచారణ జరిపేందుకు అనుమతి లభించింది.మైనర్లను సివిల్ దుస్తుల్లో న్యాయవాది సమక్షంలోనే విచారించాలని కోర్టు ఆదేశించింది.ఈ క్రమంలో వారిని జువైనల్ హోమ్ లోనే కస్టడీ విచారణ జరపనున్నారు పోలీసులు.ఇప్పటికే ఫోన్ కాల్స్, సిసి టీవి ఫుటేజ్ ఆధారంగా సాదుద్దీన్ ను ప్రశ్నించిన పోలీసులు, అతనికి మైనర్ లతో ఉన్న పరిచయం, సంబంధాలతో పాటు ఇతర వ్యక్తుల ప్రమేయం పైనా ఆరా తీసినట్లు సమాచారం.
కేసుకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు.. ఆరుగురు నిందితుల సెల్ ఫోన్ లను సీజ్ చేశారు.ఘటనా సమయంలో నిందితులు వేసుకున్న దుస్తులను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఘటనా స్థలంలో నిందితుల కదలికలపైనా పోలీసులు టెక్నికల్ ఆధారాలను సేకరించారు.సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా నిందితుల కదలికలను తెలుసుకున్నారు. ఈ నేపధ్యంలోనే రెండో రోజు విచారణలో భాగంగా జువైనల్ హోమ్ లో మైనర్ లను ప్రశ్నించానున్నారు పోలీసులు. అదేసమయంలో నిందితుల టెస్ట్ ఐడెంటిఫికేషన్ పెరేడ్ కోసం పోలీసులు ఇప్పటికే పిటిషన్ కూడా దాఖలు చేశారు. మరోవైపు వారి పోటెన్సీ టెస్ట్ కోసం మరో పిటిషన్ కూడా దాఖలు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ఆమ్నేషియా రేప్ కేసు రేమండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు పేర్కొన్నారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే మనవడు, పాతబస్తీ ఎమ్మెల్యే కుమారిడి గురించి అందులో ప్రస్తావించారు.ప్రధాన సూత్రధారి జీహెచ్ఎంసీ కార్పొరేటర్ కుమారుడేనని, కార్పొరేటర్ కుమారుడే బాలికను ట్రాప్ చేశాడని నిందితుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.బాలికను తొలుత మాటల్లోకి దింపి ఆకర్షించింది అతడేనని, గతంలోనూ మనం ఒకసారి కలిశామంటూ మాటలు కలిపాడని.. ఆపై ఇంటివద్ద దించుతానంటూ నమ్మించి బాలికను తీసుకెళ్లాడని.. ఆ తర్వాత బంజారాహిల్స్లోని కాన్సు బేకరీ వద్దకు తీసుకెళ్లి బాలిక నుంచి బ్యాగ్, కళ్లద్దాలు, సెల్ఫోన్ లాక్కున్నాడని పేర్కొన్నారు.
అనంతరం బాలికను కారులోనే కూర్చోబెట్టి నిందితులందరూ బేకరీలోకి వెళ్లి తిని, సిగరెట్లు తాగారు. ఆ తర్వాత బాలిక వద్దకు వచ్చి కారులో తమతోపాటు వస్తేనే తీసుకున్న వస్తువులు ఇస్తామని బెదిరించి ఇన్నోవాలో తీసుకెళ్లారు. ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఒకరి తరువాత ఒకరు బాలిక పై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
మొత్తానికి ఆమ్నేషియా రేప్ కేసు విచారణలో తవ్వేకొద్దీ సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి.