ఒంగోలు హైవేపై 2008లో సంచలనం సృష్టించిన లారీ డ్రైవర్లు,క్లీనర్ల దారుణ హత్యల కేసులో మున్నా గ్యాంగులో 12 మందికి ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు 8వ అదనపు కోర్టు న్యాయమూర్తి మనోహర్రెడ్డి సంచలన తీర్పు చెప్పారు.ఈ గ్యాంగులో మరో ఆరుగురికి జీవిత ఖైదు విధించారు.2008లో తీవ్ర సంచలనం సృష్టించిన 13 హత్యల కేసులో ఎట్ట కేలకు కోర్టు తీర్పు వెలువరించింది.జాతీయ రహదారిపై ఐరన్ లోడు లారీలను ఆపి13 మంది డ్రైవర్లు,క్లీనర్లను దారుణంగా హత్య చేసిన మున్నా గ్యాంగుకు ఉరిశిక్ష పడింది.ఈ గ్యాంగులో మొత్తం 18 మంది ఉండగా అందరికీ శిక్ష వేస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
వారికి దొరికితే అంతే సంగతులు
ఒంగోలు సమీపంలో జాతీయ రహదారిపై అర్థరాత్రి మున్నా గ్యాంగ్ లారీలను ఆపి డ్రైవర్,క్లీనర్లను దారుణంగా హత్య చేసి, ఒంగోలు పరిసర ప్రాంతాల్లో వాగుల్లో గోతులు తీసి పాతిపెట్టారు.ఇలా13 మంది డ్రైవర్లు,క్లీనర్లు హత్య జరిగి లారీలు అదృశ్యం కావడం అప్పట్లో పెను సంచలనం అయింది.దీంతో పోలీసులు సీరియస్గా తీసుకుని నిందితులైన మున్నా గ్యాంగును అరెస్టు చేసి జైలుకు పంపారు.అప్పటి నుంచి కోర్టులో వాదనలు నడిచాయి.ఒంగోలు తాలూకా పీఎస్, సింగరాయకొండ,మద్దిపాడు పోలీస్ స్టేషన్లలో ఈ గ్యాంగుపై ఆరు కేసులు నమోదు చేశారు.వీటిల్లో నాలుగు కేసుల్లో మున్నాతోపాటు 18 మందిపై నేరం రుజువైనట్లు న్యాయమూర్తి ఈ నెల18 ప్రకటించారు.వీరంతా దారిదోపిడీలు,హత్యలు చేసినట్టు ఆధారాలతో సహా నిరూపణ అయింది.దీంతో వారిలో 12 మందికి ఉరిశిక్ష,ఆరుగురికి జీవితఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
Must Read ;- పోలీసుల వేధింపులు.. ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్య