ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాల్లో సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒకటి. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా సంస్థలు రూపొందించిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ హక్కులను ఈ సంస్థ సొంతం చేసుకుంది. ఇండియాలోనే గాక పలు దేశాలలో ఉత్పత్తి చేసేందుకు ఈ సంస్థ అనుమతి తీసుకుంది. ఈ వ్యాక్సిన్ విజయవంతంగా రెండు దశలను పూర్తి చేసుకుంది. మూడవ దశలో వాక్సిన్ తీసుకున్న వాలంటీర్ కు సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో తమ ప్రయోగాలను నిలుపుదల చేసింది. మరొకమారు తమ వ్యాక్సిన్ ను ట్రయల్స్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో సీరమ్ ఇన్ స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా చేసిన కామెంట్స్ పై దేశ ప్రజలు మండిపడుతున్నారు.
వచ్చే ఏడాది నాటికి అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అలా చేయాలంటే భారత కేంద్ర ప్రభుత్వం వద్ద రూ.80 వేల కోట్లు ఉన్నాయా? అంటూ అదర్ పూనావాలా ప్రశ్నించారు. దేశం పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ లు కొనుగోలు చేయవలసి వస్తోందని ఇందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ కామెంట్స్ పై దేశ ప్రజలు మండిపడుతున్నారు. కరోనా వారియర్స్ గా ఉన్న వారి నుంచి ఇలాంటి అహంకార మాటలు రావడమేంటని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా సంగతి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన కామెంట్స్ ను ట్రోల్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.
గతంలో కూడా ఇలాగే..
కరోనా లాంటి మహమ్మారికి వ్యాక్సిన్ తయారీకి దిగ్గజ ఫార్మా కంపెనీలైన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా సంస్థలతో ఒప్పందం చేసుకోవడం ద్వారా సీరం ప్రధాన వార్తలలో నిలిచింది. ఈ వ్యాక్సిన్ వస్తే మొదట మా మతం పార్శిలకే ఇస్తామని ట్వీట్ చేసి పూనావాలా సంచలనం రేపాడు. ఆ తరువాత ఆ ట్వీట్ ను డిలీట్ చేసి సంజాయిషీ ఇచ్చుకున్నా కంపెనీపై ఉన్న విశ్వాసాన్ని సడలిపోయేలా చేసిన పూనావాలాపై దేశ ప్రజలు మండిపడ్డారు. ఆ ఘటన మరిచిపోకముందే మూడవ దశలో వాక్సిన్ తీసుకున్న వాలంటీర్ కు సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో తమ ప్రయోగాలను నిలుపుదల చేసింది. ఈ సందర్భంలో తాము వ్యాక్సిన్ ప్రయోగాలను నిలుపుదల చేస్తున్నట్లు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా సంస్థలు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ ప్రకటన వచ్చినా ఇండియాలో తాము ట్రయల్స్ నిర్వహిస్తామని కంపెనీ వెల్లడించింది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ హెచ్చరికలు జారీ చేయడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల కిందట పూనావాలా ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా అందరికీ ఇవ్వాలంటే 2024 వరకు ఆగవలసిందే అంటూ మరో విచిత్రమైన కామెంట్స్ చేశారు. తాజాగా ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ అందించాలనుకుంటే పెద్దమొత్తంలో వ్యాక్సిన్లను కొని పంపిణీ చేయాల్సి ఉంటుందని అందుకు భారత కేంద్ర ప్రభుత్వం వద్ద రూ.80 వేల కోట్లు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై దేశ ప్రజలు కరోనా వారియర్ కు అంత అహంభావం పనికిరాదని హితవు పలుకుతున్నారు!