రేపు సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ప్రచారం ముగింపు దశకు చేరుకుంటున్న క్రమంలో నేతల మాటల్లో పదును పెరిగింది. తమ ప్రసంగాలతో బీజేపీ నేతలు కాకపుట్టిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అస్సలు ఎక్కడ తగ్గడంలేదు. తమ ప్రత్యర్ధి పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఛాన్స్ దొరికితే చాలన్నట్లుగా ఆరోపణలను గుప్పిస్తున్నారు.
డోంట్ కేర్ అంటున్న బండి…
బండి సంజయ్ ఎక్కడా కూడా అస్సలు వెనక్కు తగ్గడం లేదు. టీఆర్ఎస్ పార్టీ నేతలపై ఒంటి కాలుపై లేస్తున్నారు. తన ప్రసంగాల్లో సంచలన వ్యాఖ్యలతో ప్రత్యర్థులను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సర్జికల్ స్ట్రైక్, దారుస్సలాం వ్యాఖ్యలు గాలి దుమారంరేపిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి బండి సంజయ్పై పోలీసులు కేసు కూడా నమోదు చేయడంతో ఈ విషయంపై సంజయ్ స్పందిస్తూ అరెస్టు ఇవాళ చేస్తారా? రేపు చేస్తారా? ఎప్పుడు చేస్తారో చేసుకోండి అని సవాల్ విసిరి మరో సంచలనానికి తెరలేపారు.
తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ శనివారం ముషీరాబాద్ ప్రాంతాల్లో రోడ్ షోలలో పాల్గొని ప్రసంగించారు. ఈ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ప్రభంజనం సృష్టించబోతుంది. ఈ ఎన్నికల ఫలితాల తరువాత ఈ ప్రభుత్వం నిలబడదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయనున్నారన్నారని బండి సంజయ్ తీవ్ర స్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతటితో ఆగకుండా ఎక్కడా చూసిన వారిద్దరి ఫోటోలే టీఆర్ఎస్ పార్టీలో కనబడతాయని విమర్శించారు. ఇతర మంత్రులు ఫోటోలు ఎందుకు పెట్టరని ప్రశ్నించారు. బాత్రూమ్ల దగ్గర కూడా కేసీఆర్ ఫోటోలు అంటే జనం నవ్వుతున్నారని బండి విమర్శించారు. మళ్లీ చెబుతున్నా ఘాట్లను టచ్ చేస్తే దారుసలేం కూల్చివేస్తా అంటు బండి ఆరోపించారు.
టీఆర్ఎస్కు వార్నింగ్…
హైదరాబాద్కు అమిత్షా వస్తున్నారు.. టీఆర్ఎస్ జాగ్రత్తగా ఉండాలని బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంట్లో భార్య పిల్లలకు చెప్పి వచ్చా. చావుకు నేను భయడను అని అన్నారు. ఈ ఎన్నికల తరువాత అవినీతి ప్రభుత్వం కూలిపోతుందని, కేసీఆర్ జైలుకి పోవడం ఖాయమన్నారు. కేంద్రం అన్ని లెక్కలను తేల్చుతుందని సంజయ్ ఆరోపించారు.
Must Read ;- బీజేపీ శిబిరంపై బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్స్