యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ ప్రధాన పాత్రలో చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కార్తికేయ 2. సూపర్ హిట్ మూవీ కార్తికేయ కు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమా మొన్నీ మధ్యనే రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టింది. ప్రస్తుతం ‘కార్తికేయ 2’ చిత్ర బృందం హిమాచల్ ప్రదేశ్ లోని సిస్సు అనే ప్రాంతంలో ఉన్నారు. ఆ షెడ్యూల్ లో హై యాక్టేన్ యాక్షన్ సీక్వెన్సెస్ చిత్రీకరిస్తున్నారు. అయితే సడెన్ గా మంచు తుఫాన్ ముంచుకు రావడంతో.. షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది.
మైనస్ డిగ్రీల శీతల వాతావరణంలో .. ‘కార్తికేయ 2’ చిత్రం యూనిట్ చాలా అవస్థలు పడుతున్నట్టు .. వారు విడుదల చేసిన వీడియోలో కనిపిస్తోంది. వర్షం కురిసిన విధంగా మంచు కురియడం చూడొచ్చు. నిర్విరామంగా షూటింగ్ జరుగుతున్నట్టు అర్ధమవుతోంది. మంచు తుఫాన్ ఆగిన తర్వాత మళ్ళీ నిఖిల్ మీద యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతుందట.
దేవాలయాల నేపథ్యంలో. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ‘కార్తికేయ 2’ రూపొందుతోంది. కాకపోతే.. మొదటి భాగంలో కథానాయికగా నటించిన స్వాతి రెడ్డి మాత్రం ఇందులో కథానాయికగా నటించడం లేదని తెలుస్తోంది. ఆమె స్థానంలో మరో హీరోయిన్ ను ఎంపిక చేశారట. మరి రెండో భాగం.. మొదటి భాగం స్థాయిలో విజయం సాధిస్తుందో లేదో చూడాలి.
Also Read :‘కార్తికేయ 2’ లో బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్
https://twitter.com/baraju_SuperHit/status/1374682770455240704











