టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ నటించిన సూపర్ హిట్ మూవీ ‘కార్తికేయ’. చందు మొండేటి దర్శకత్వంలో తెరెక్కిన ఈ మిస్టిక్ థ్రిల్లర్ 2014లో విడుదలైంది. స్వామిరారా తర్వాత నిఖిల్ కు పేరు తెచ్చిపెట్టిన చిత్రాల్లో ఇది ఒకటి. మళ్ళీ ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కబోతోంది. కార్తికేయ 2 గా రూపొందనున్న ఈ సినిమాని అదే దర్శకుడు చందుమొండేటి రూపొందించబోతున్నాడు.
దేవాలయం నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ మూవీ కోసం మరో ఆసక్తికరమైన కథను రాసుకున్నాడు దర్శకుడు. అప్పట్లో ఈ సినిమాని మేగ్నస్ సినీ ప్రైమ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై వెంకట్ శ్రీనివాస్ నిర్మించగా.. ఇప్పుడు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ధన్వంతరి అనే పాత్రను బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ అనుపమ్ ఖేర్ పోషిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయనకి ‘కార్తికేయ 2’ మూవీ టీమ్ ఆహ్వానం పలుకుతూ.. ట్విట్టర్ లో ప్రకటించింది. అతి త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది.
Must Read ;- ఇక ఈ కుర్రహీరోను ఆపడం కష్టమే!
Team #Karthikeya2 🐍 welcomes one of India's most versatile actors on board!
Happy Birthday @AnupamPKher ji @actor_Nikhil @chandoomondeti @kaalabhairava7 @AbhishekOfficl @vivekkuchibotla @sahisuresh @MayankOfficl @peoplemediafcy @AAArtsOfficial#AnupamKherInKarthikeya2 pic.twitter.com/st6N0Actb2
— BARaju (@baraju_SuperHit) March 7, 2021