‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది. అందరి మనసులు దోచుకుంది. ఎన్నో విభిన్న పాత్రలు పోషించి. దశాబ్ధ కాలంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. పెళ్లి చేసుకున్నా సినిమాల్లో నటిస్తూనే ఉంది. అలాగే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. అయితే.. తన గురించి ఇప్పటి వరకు చెప్పని ఓ విషయాన్ని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఐదేళ్ల వయసు నుంచి తాను బ్రాంకియల్ ఆస్తమా వ్యాధితో బాధపడు తున్నానని కాజల్ చెప్పింది. శీతాకాలం వచ్చిందంటే.. టెన్షనే. ఎందుకంటే.. శీతాకాలంలో ఈ వ్యాధి మరింత ఎక్కువవుతుందని… ఈ వ్యాధి వల్ల తాను చాలా ఇబ్బందులు పడ్డానని తెలిపింది. అంతే కాకుండా.. ఈ ఆస్తమా వ్యాధి వలన ఆహారం విషయంలో కూడా తాను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పింది.
ఈ ఆస్తమా వ్యాధి నుంచి బయటపడేందుకు తాను ఇన్ హేలర్ వాడతానని కాజల్ తెలిపింది. ఇన్ హేలర్ వాడటం వల్ల కాస్త రిలీఫ్ లభించిందని చెప్పింది. అయితే.. ఇన్ హేలర్ వాడేందుకు చాలా మంది సిగ్గు పడుతుంటారని.. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించద్దు. ఇన్ హేలర్ లు ఉపయోగించాలని సూచించింది. సినిమాల విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’ సినిమాలో నటిస్తుంది. అలాగే వెబ్ సిరీస్లో కూడా నటిస్తుంది.
Must Read ;- కాజల్ అగర్వాల్ పేరు మార్చుకుందా.?











