నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఇటీవల అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. అలాగే క్రాక్ సినిమాతో డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ భారీ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఈ భారీ క్రేజీ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇటీవల ఈ సినిమా సెట్స్ పైకి వచ్చింది. సిరిసిల్లలో భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ మూవీ రీమేక్ అని వార్తలు వచ్చాయి. ప్రచారంలో ఉన్న వార్తల పై డైరెక్టర్ మలినేని గోపీచంద్ స్పందిస్తూ… ఇది స్ట్రైయిట్ మూవీ.. రీమేక్ కాదు. దయచేసి అసత్యాలను ప్రచారం చేయద్దు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లను రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీంతో అసలు ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటి..? అనేది అందరిలోనూ ఆసక్తిగా మారింది.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ మూవీ స్టోరీ లైన్ ఇదే అంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ స్టోరీ లైన్ ఏంటంటే… రాయలసీయ ప్రాంతంలో నీటి సమస్య గురించి అందరికీ తెలిసిందే. అక్కడ ప్రజలు నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతుంటారట. ఈ నీటి సమస్యను పరిష్కరించడం కోసం ప్రభుత్వం, అవినీతి రాజకీయ నాయకుల పై పై పోరాడే తండ్రీకొడుకుల కథ అని సమాచారం. తండ్రీకొడుకులుగా బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఈ రెండు పాత్రలు చాలా వైవిధ్యంగా ఉండేలా డిజైన్ చేశారట దర్శకుడు గోపీచంద్. మరి.. ప్రచారంలో ఉన్న స్టోరీ లైన్ నిజమేనా..? కాదా..? అనేది తెలియాల్సి ఉంది.