May 2, 2026 9:27 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editorial

దయచేసి గమనించగలరు.. ‘ఎన్‌కౌంటర్.. ఇంకా జరగనేలేదు!’

మీడియా అత్యుత్సాహం చాలా సందర్భాల్లో బయటపడిపోతుంటుంది. తాజాగా అలాంటి తప్పిదమే మరోటి జరిగింది. మహబూబాబాద్ ఘటనలో కిడ్నాప్ అయిన బాలుడు దీక్షిత్ ను హత్యచేసిన వారు ఎన్‌కౌంటర్ అయ్యారంటూ పుకార్లు వెల్లువెత్తాయి. మీడియాసంస్థలు కూడా కొన్ని ఆ అబద్ధపు వార్తను ప్రచారంలో పెట్టేశాయి. 

October 22, 2020 at 4:54 PM
in Editorial, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

సోషల్ మీడియా విశ్వరూపం దాల్చి ఉన్న ఈ రోజుల్లో.. ఒక అబద్ధం- ప్రపంచంమొత్తం వ్యాపించిపోవడానికి కొన్ని సెకన్ల సమయం చాలు.

నిజానిజాల్ని చెక్ చేసుకుని వార్తల్ని ప్రచురించేంత సమయం మీడియా సంస్థలకు ఉండడం లేదు. ఆ నిజాల నిర్ధరణ కంటే వేగంగా, హాట్ హాట్ గా ప్రజలకు వార్తను వడ్డించడం వారికి తక్షణ కర్తవ్యం అనిపిస్తోంది. పైగా ‘మేమే నిజం చెప్పాం’ అనే నిబద్ధతను మర్చిపోయి.. ‘మేమే ముందు చెప్పాం’ అనే అవాంఛితమైన స్పీడ్ యుగంలో ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు వేలంవెర్రిగా పరుగులు తీస్తున్న వేళ.. తప్పుడు వార్తలు ప్రచారం లోకి వచ్చేయడం చాలా మామూలు విషయం అయిపోయింది.

కేవలం పత్రికలు ఉన్నరోజుల్లో  ఇలాంటి తప్పులు తక్కువ జరిగేవి. ప్రింటింగ్ మొదలయ్యేలోగా.. అందరూ జరిగిన విషయాల్ని, జరుగుతున్న ప్రచారాల్ని ఒకటికి రెండుసార్లు ధ్రువీకరించుకుని వార్తలు అందించే వాళ్లు.

ఎక్కువ ప్రింటింగ్ యూనిట్లు ఉన్న బలంతో అర్ధరాత్రి వరకు సంఘటనలు జరిగిన తెల్లారేలోగా వాటిని ప్రజలకుఅందించే వెసులుబాటు ఉన్న ఈనాడు ఆరోజుల్లో కొన్ని తాజా వార్తలు కవర్ చేసినప్పుడు.. అవి నిజమే అయినా.. ప్రజలకు అప్పటిదాకా తెలియని కారణంగా వివాదాలు రేగిన సందర్భాలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ హత్యకు గురైనప్పుడు.. కొన్ని జిల్లాలకు కేవలం ఈనాడు ద్వారా మాత్రమే ఆ విషయం తెలిసింది. కాంగ్రెస్ అభిమానులు ఆ విషయాన్ని నమ్మకుండా.. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని నిందిస్తూ ఈనాడు పత్రికల్ని రోడ్ల మీద తగలబెట్టడం జరిగింది. దాన్ని తప్పుడు వార్త అనుకున్నారు.

టీవీ న్యూస్ ఛానెళ్ల హవా మొదలైన తర్వాత.. ‘ముందే చెప్పాం’ అనేది ఛానెళ్ల మధ్య పోటీకి ఒక తూకం రాయిగా మారిన తర్వాత.. అవాంఛనీయ పోకడలు ప్రవేశించాయి. ఎవరైనా సెలబ్రిటీ ఆస్పత్రిలో ఎడ్మిట్ అయితే చాలు.. ఎప్పుడెప్పుడు చచ్చిపోతాడా? అని కాపుకాయడం అలవాటైంది. అంతకుముందు కూడా.. పత్రికల్లో ఇలాంటి కసరత్తు ఉండేది. అనారోగ్యంతో ఎవరైనా సెలబ్రిటీ పరిస్థితి విషమంగా ఉంటే.. చనిపోగానే కథనాలు ఇవ్వడానికి ముందే సిద్ధం చేసి పెట్టుకునే వారు. కానీ.. అలాంటి కసరత్తు ఆఫీసు దాటి బాహ్యప్రపంచానికి తెలిసేది కాదు. టీవీ ఛానెళ్లు వచ్చాక.. హాస్పిటల్ ముందు.. లైవ్ వెహికిల్స్ పెట్టుకుని నిరీక్షిస్తూ.. ‘ఎప్పుడు చచ్చిపోతాడా?’ అని ఎదురుచూడడం రూపేణా.. మీడియా పోకడలు రోడ్డున పడ్డాయి. ఈ క్రమంలోనే.. ముందే ప్రజలకు తాము వార్త చేయవేయాలనే ఆశతో.. ‘.. మనకికలేరు’ అంటూ ముందుగా వార్తలు ఇచ్చేసి, తర్వాత చానెళ్లు నాలుక కరచుకున్న సందర్భాలు అనేకం. ఆ పోటీలో భాగంగానే.. ఒక ఛానెల్లో చావు వార్త, మరో ఛానల్ లో పరిస్థితి విషమం అనే వార్త అటూ ఇటూ చూస్తూ ప్రజలు గందరగోళానికి గురైన సందర్భాలు అనేకం. వెబ్ సైట్ల హవా వచ్చాక ఇదే పోకడ కొనసాగుతోంది.

వార్త కరెక్టా కాదా చెక్ చేసుకోకుండానే పబ్లిష్ చేసేయడం. తప్పని తెలిస్తే.. ఆ తర్వాత నిదానంగా దిద్దుకోవడం వెబ్ సైట్లకు చాలా సులువైన పని అయిపోయింది. సోషల్ మీడియా విజృంభణ మొదలైన తర్వాత.. అసలు వార్త అనేదానికే విలువ లేకుండాపోయింది. అసలు ఎవరూ చావాల్సిన అవసరమే లేదు.. చావుదాకా వెళ్లాల్సిన అవసరమే లేదు. ముందే సంతాప సందేశాలు వాట్సప్, ట్విటర్, ఫేస్‌బుక్‌లలో వైరల్ అయిపోతుంటాయి. అలాంటి అసహ్యమైన పోకడలకు నిన్నటి పరిణామాలు కూడా ఒక ఉదాహరణ. తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు నాయని నర్సింహారెడ్డి.. ఆస్పత్రిలో విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి బాగాలేదు. అందుకే సీఎం, మంత్రులు ఆస్పత్రిని సందర్శించారు. -అంతవరకే వార్త.

అయితే.. సోషల్ మీడియాలో మాాత్రం సాయంత్రం నుంచే ఆయనకు సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. ఆయన ఫోటోను అందంగా ఇరువైపులా దీపస్తంభాల బొమ్మలతో- నివాళి యాడ్ లాగా డిజైన్ చేసి.. సర్కులేట్ చేయడం ప్రారంభించారు. తీరా ఆయన అర్ధరాత్రి దాటిన తర్వాత మరణించారు. ఒకరి చావు  మీద ఇంత అత్యుత్సాహం ఎందుకు? సోషల్ మీడియా ఇలాంటి దుర్మార్గమైన అసహ్యకరమైన ప్రచాారాలకు తెరతీస్తోంటే.. ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ సైట్లు అక్కడినుంచి అబద్ధాల్ని అందిపుచ్చుకుని.. గోరంతలు కొండంతలుగా అల్లుకుపోతున్నాయి. గొర్రెదాటుగా, గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఇలాంటి అబద్ధపు వార్తల ప్రచారాల్ని అరికట్టడం మన బాధ్యతే అని తెలుసుకోకుంటే..  మీడియా పరువు పోతుంది.

ఎన్‌కౌంటర్ కోరిక మరీ ఘోరం..

ఇలాంటి ఊహాగానాలు రాయడంలో మీడియా ఇవాళ (గురువారం) మరీ శృతితప్పింది. వేగంగా వార్తలు ఇవ్వాలనే అత్యుత్సాహమో.. ఇంకేదైనా పైత్యమో తెలియదు గానీ.. ఒక కేసులో తప్పు చేసిన వాళ్లు పోలీసులకు దొరికినట్లుగా ఇలా వార్త రాగానే.. వెంటనే.. ఎన్ కౌంటర్ కూడా జరిగిపోయినట్లు కథనాలు అల్లి ప్రచురించేశారు.

పిల్లాడిని చంపేశారనే వార్త బయటకు వచ్చిన తర్వాత.. దీనికి సంబంధించి నలుగురిని/ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టుగా తొలుత వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరిని ఎన్‌కౌంటర్ చేసినట్టుగా వార్తలు వచ్చేశాయి. గతంలో సంఘటనల్ని దృష్టిలో ఉంచుకుని.. ఇలాంటి నేరం బయటపడ్డాక ఎట్టిపరిస్థితుల్లో ఎన్ కౌంటర్ చేసేస్తారని  మీడియా ఫిక్సయిపోయినట్టుంది. అందుకే అలాంటి పుకారు మొదలు కాగానే.. అర్జంటుగా ఒక క్వశ్చన్ మార్క్ (?) పెట్టేసి ఎన్ కౌంటర్ చేసేసినట్టుగా వార్తలు పెట్టారు.

ఏదో చిల్లరగా నడిచే వెబ్ సైట్లు ఇలాంటి వార్తలు పెడితే అదొక తీరు. వాటిని చూసే వారు పెద్దగా ఉండరని అనుకోవచ్చు. కానీ.. సాక్షి, ఆంధ్రజ్యోతి లాంటి ప్రముఖ దినపత్రికలకు అనుబంధంగా ఉండే వెబ్ సైట్లు కూడా ఇలాంటి పనే చేస్తే ఎలా అర్థం చేసుకోవాలి. సర్కులేషన్ పరంగా గాని, వ్యూస్ /క్లిక్స్ పరంగా గానీ పెద్ద పత్రికలు.. అలాంటి ‘పెద్ద’ హోదాకు చేరుకునే కొద్దీ.. మరింత బాధ్యతగా వార్తలు అందించాలి. సోషల్ మీడియాలో వందల పుకార్లు రావడం ఒక ఎత్తు.. బాధ్యతాయుతమైన ఇలాంటి పత్రికల వెబ్ సైట్స్‌లో వార్తగా రావడం మరో ఎత్తు. పత్రికల్లో (వాటి వెబ్ సైట్స్ లో) వస్తే.. అబద్ధాన్ని కూడా నిజమని ప్రజలు నమ్ముతారు. ఈ స్పృహ పాత్రికేయుల్లో ఉండాలి.

ఈ పుకార్లు ఎంతగా విస్తరించాయంటే.. పోలీసులు వీటికి వివరణ ఇచ్చుకున్నారు. ప్రస్తుతానికి ఒక్కరు మాత్రమే పట్టుబడ్డారని, ఇద్దరిని ఎన్‌కౌంటర్ చేసినట్టుగా జరుగుతున్న ప్రచారం నిజం కాదని తేల్చారు.

నిజానికి.. వాతావరణం అలాగే అనిపించింది. కిడ్నాప్ అయిన బాలుడు హత్యకు గురైనట్లు వార్త వచ్చిన తర్వాత.. అదనపు పోలీసు బలగాల్ని తరలించడం, రోప్ పార్టీలను తీసుకెళ్లడం ఇలాంటి వ్యవహారాలన్నీ ఎన్‌కౌంటర్ జరుగుతుందనే అభిప్రాయం కలిగించేలా సాగాయి. స్థానిక విలేకర్లతో మాట్లాడినప్పుడు.. ‘ఇంకా కాలేదు.. కానీ, అయితది’ అనే మాటే వినవచ్చింది. ఒకవేళ ఎన్ కౌంటర్ జరగవచ్చేమో కూడా.. కానీ, బాధ్యతగల పత్రికలు నిజానిజాలు చెక్ చేసుకోకుండా ‘క్వశ్చన్ మార్క్ (?)’ పెట్టి అబద్ధాలను ప్రచారంలో పెట్టేయవచ్చు కదా.. అని మీడియా విలువల్లోని లొసుగుల్ని వాడుకుని.. ఇలా చెలరేగితే ఎలా? మనం ఓసారి మన ప్రవర్తన తీరు తెన్నల్ని సమీక్షించుకోవాలి.

.. సురేష్ పిళ్లె

Tags: editorialencounterleotopmahaboobabad dikshitsureshpillai
Previous Post

ఏమిటీ ‘నర్తనశాల’.. బాలకృష్ణ, సౌందర్య ఏంచేశారు?

Next Post

‘నర్తనశాల’ బాటలో ఆగిపోయిన చిరంజీవి సినిమా?

Related Posts

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Mind Blowing Hot Photos Of Ketika Sharma

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

శివనామస్మరణలతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు!

‘జెర్సీ’దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన చరణ్?

దీన పరిస్థితులలో అనిల్ అంబానీ!!

అమెరికా బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా?

బీజేపీ నోట.. మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల మాట‌:స‌ంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2 గంటల 20 నిమిషాల్లోనే తిరుమల మెట్లు ఎక్కేశాడట.. !

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist