February 8, 2023 12:19 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
25 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editorial

దయచేసి గమనించగలరు.. ‘ఎన్‌కౌంటర్.. ఇంకా జరగనేలేదు!’

మీడియా అత్యుత్సాహం చాలా సందర్భాల్లో బయటపడిపోతుంటుంది. తాజాగా అలాంటి తప్పిదమే మరోటి జరిగింది. మహబూబాబాద్ ఘటనలో కిడ్నాప్ అయిన బాలుడు దీక్షిత్ ను హత్యచేసిన వారు ఎన్‌కౌంటర్ అయ్యారంటూ పుకార్లు వెల్లువెత్తాయి. మీడియాసంస్థలు కూడా కొన్ని ఆ అబద్ధపు వార్తను ప్రచారంలో పెట్టేశాయి. 

October 22, 2020 at 4:54 PM
in Editorial, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

సోషల్ మీడియా విశ్వరూపం దాల్చి ఉన్న ఈ రోజుల్లో.. ఒక అబద్ధం- ప్రపంచంమొత్తం వ్యాపించిపోవడానికి కొన్ని సెకన్ల సమయం చాలు.

నిజానిజాల్ని చెక్ చేసుకుని వార్తల్ని ప్రచురించేంత సమయం మీడియా సంస్థలకు ఉండడం లేదు. ఆ నిజాల నిర్ధరణ కంటే వేగంగా, హాట్ హాట్ గా ప్రజలకు వార్తను వడ్డించడం వారికి తక్షణ కర్తవ్యం అనిపిస్తోంది. పైగా ‘మేమే నిజం చెప్పాం’ అనే నిబద్ధతను మర్చిపోయి.. ‘మేమే ముందు చెప్పాం’ అనే అవాంఛితమైన స్పీడ్ యుగంలో ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు వేలంవెర్రిగా పరుగులు తీస్తున్న వేళ.. తప్పుడు వార్తలు ప్రచారం లోకి వచ్చేయడం చాలా మామూలు విషయం అయిపోయింది.

కేవలం పత్రికలు ఉన్నరోజుల్లో  ఇలాంటి తప్పులు తక్కువ జరిగేవి. ప్రింటింగ్ మొదలయ్యేలోగా.. అందరూ జరిగిన విషయాల్ని, జరుగుతున్న ప్రచారాల్ని ఒకటికి రెండుసార్లు ధ్రువీకరించుకుని వార్తలు అందించే వాళ్లు.

ఎక్కువ ప్రింటింగ్ యూనిట్లు ఉన్న బలంతో అర్ధరాత్రి వరకు సంఘటనలు జరిగిన తెల్లారేలోగా వాటిని ప్రజలకుఅందించే వెసులుబాటు ఉన్న ఈనాడు ఆరోజుల్లో కొన్ని తాజా వార్తలు కవర్ చేసినప్పుడు.. అవి నిజమే అయినా.. ప్రజలకు అప్పటిదాకా తెలియని కారణంగా వివాదాలు రేగిన సందర్భాలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ హత్యకు గురైనప్పుడు.. కొన్ని జిల్లాలకు కేవలం ఈనాడు ద్వారా మాత్రమే ఆ విషయం తెలిసింది. కాంగ్రెస్ అభిమానులు ఆ విషయాన్ని నమ్మకుండా.. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని నిందిస్తూ ఈనాడు పత్రికల్ని రోడ్ల మీద తగలబెట్టడం జరిగింది. దాన్ని తప్పుడు వార్త అనుకున్నారు.

టీవీ న్యూస్ ఛానెళ్ల హవా మొదలైన తర్వాత.. ‘ముందే చెప్పాం’ అనేది ఛానెళ్ల మధ్య పోటీకి ఒక తూకం రాయిగా మారిన తర్వాత.. అవాంఛనీయ పోకడలు ప్రవేశించాయి. ఎవరైనా సెలబ్రిటీ ఆస్పత్రిలో ఎడ్మిట్ అయితే చాలు.. ఎప్పుడెప్పుడు చచ్చిపోతాడా? అని కాపుకాయడం అలవాటైంది. అంతకుముందు కూడా.. పత్రికల్లో ఇలాంటి కసరత్తు ఉండేది. అనారోగ్యంతో ఎవరైనా సెలబ్రిటీ పరిస్థితి విషమంగా ఉంటే.. చనిపోగానే కథనాలు ఇవ్వడానికి ముందే సిద్ధం చేసి పెట్టుకునే వారు. కానీ.. అలాంటి కసరత్తు ఆఫీసు దాటి బాహ్యప్రపంచానికి తెలిసేది కాదు. టీవీ ఛానెళ్లు వచ్చాక.. హాస్పిటల్ ముందు.. లైవ్ వెహికిల్స్ పెట్టుకుని నిరీక్షిస్తూ.. ‘ఎప్పుడు చచ్చిపోతాడా?’ అని ఎదురుచూడడం రూపేణా.. మీడియా పోకడలు రోడ్డున పడ్డాయి. ఈ క్రమంలోనే.. ముందే ప్రజలకు తాము వార్త చేయవేయాలనే ఆశతో.. ‘.. మనకికలేరు’ అంటూ ముందుగా వార్తలు ఇచ్చేసి, తర్వాత చానెళ్లు నాలుక కరచుకున్న సందర్భాలు అనేకం. ఆ పోటీలో భాగంగానే.. ఒక ఛానెల్లో చావు వార్త, మరో ఛానల్ లో పరిస్థితి విషమం అనే వార్త అటూ ఇటూ చూస్తూ ప్రజలు గందరగోళానికి గురైన సందర్భాలు అనేకం. వెబ్ సైట్ల హవా వచ్చాక ఇదే పోకడ కొనసాగుతోంది.

వార్త కరెక్టా కాదా చెక్ చేసుకోకుండానే పబ్లిష్ చేసేయడం. తప్పని తెలిస్తే.. ఆ తర్వాత నిదానంగా దిద్దుకోవడం వెబ్ సైట్లకు చాలా సులువైన పని అయిపోయింది. సోషల్ మీడియా విజృంభణ మొదలైన తర్వాత.. అసలు వార్త అనేదానికే విలువ లేకుండాపోయింది. అసలు ఎవరూ చావాల్సిన అవసరమే లేదు.. చావుదాకా వెళ్లాల్సిన అవసరమే లేదు. ముందే సంతాప సందేశాలు వాట్సప్, ట్విటర్, ఫేస్‌బుక్‌లలో వైరల్ అయిపోతుంటాయి. అలాంటి అసహ్యమైన పోకడలకు నిన్నటి పరిణామాలు కూడా ఒక ఉదాహరణ. తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు నాయని నర్సింహారెడ్డి.. ఆస్పత్రిలో విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి బాగాలేదు. అందుకే సీఎం, మంత్రులు ఆస్పత్రిని సందర్శించారు. -అంతవరకే వార్త.

అయితే.. సోషల్ మీడియాలో మాాత్రం సాయంత్రం నుంచే ఆయనకు సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. ఆయన ఫోటోను అందంగా ఇరువైపులా దీపస్తంభాల బొమ్మలతో- నివాళి యాడ్ లాగా డిజైన్ చేసి.. సర్కులేట్ చేయడం ప్రారంభించారు. తీరా ఆయన అర్ధరాత్రి దాటిన తర్వాత మరణించారు. ఒకరి చావు  మీద ఇంత అత్యుత్సాహం ఎందుకు? సోషల్ మీడియా ఇలాంటి దుర్మార్గమైన అసహ్యకరమైన ప్రచాారాలకు తెరతీస్తోంటే.. ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ సైట్లు అక్కడినుంచి అబద్ధాల్ని అందిపుచ్చుకుని.. గోరంతలు కొండంతలుగా అల్లుకుపోతున్నాయి. గొర్రెదాటుగా, గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఇలాంటి అబద్ధపు వార్తల ప్రచారాల్ని అరికట్టడం మన బాధ్యతే అని తెలుసుకోకుంటే..  మీడియా పరువు పోతుంది.

ఎన్‌కౌంటర్ కోరిక మరీ ఘోరం..

ఇలాంటి ఊహాగానాలు రాయడంలో మీడియా ఇవాళ (గురువారం) మరీ శృతితప్పింది. వేగంగా వార్తలు ఇవ్వాలనే అత్యుత్సాహమో.. ఇంకేదైనా పైత్యమో తెలియదు గానీ.. ఒక కేసులో తప్పు చేసిన వాళ్లు పోలీసులకు దొరికినట్లుగా ఇలా వార్త రాగానే.. వెంటనే.. ఎన్ కౌంటర్ కూడా జరిగిపోయినట్లు కథనాలు అల్లి ప్రచురించేశారు.

పిల్లాడిని చంపేశారనే వార్త బయటకు వచ్చిన తర్వాత.. దీనికి సంబంధించి నలుగురిని/ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టుగా తొలుత వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరిని ఎన్‌కౌంటర్ చేసినట్టుగా వార్తలు వచ్చేశాయి. గతంలో సంఘటనల్ని దృష్టిలో ఉంచుకుని.. ఇలాంటి నేరం బయటపడ్డాక ఎట్టిపరిస్థితుల్లో ఎన్ కౌంటర్ చేసేస్తారని  మీడియా ఫిక్సయిపోయినట్టుంది. అందుకే అలాంటి పుకారు మొదలు కాగానే.. అర్జంటుగా ఒక క్వశ్చన్ మార్క్ (?) పెట్టేసి ఎన్ కౌంటర్ చేసేసినట్టుగా వార్తలు పెట్టారు.

ఏదో చిల్లరగా నడిచే వెబ్ సైట్లు ఇలాంటి వార్తలు పెడితే అదొక తీరు. వాటిని చూసే వారు పెద్దగా ఉండరని అనుకోవచ్చు. కానీ.. సాక్షి, ఆంధ్రజ్యోతి లాంటి ప్రముఖ దినపత్రికలకు అనుబంధంగా ఉండే వెబ్ సైట్లు కూడా ఇలాంటి పనే చేస్తే ఎలా అర్థం చేసుకోవాలి. సర్కులేషన్ పరంగా గాని, వ్యూస్ /క్లిక్స్ పరంగా గానీ పెద్ద పత్రికలు.. అలాంటి ‘పెద్ద’ హోదాకు చేరుకునే కొద్దీ.. మరింత బాధ్యతగా వార్తలు అందించాలి. సోషల్ మీడియాలో వందల పుకార్లు రావడం ఒక ఎత్తు.. బాధ్యతాయుతమైన ఇలాంటి పత్రికల వెబ్ సైట్స్‌లో వార్తగా రావడం మరో ఎత్తు. పత్రికల్లో (వాటి వెబ్ సైట్స్ లో) వస్తే.. అబద్ధాన్ని కూడా నిజమని ప్రజలు నమ్ముతారు. ఈ స్పృహ పాత్రికేయుల్లో ఉండాలి.

ఈ పుకార్లు ఎంతగా విస్తరించాయంటే.. పోలీసులు వీటికి వివరణ ఇచ్చుకున్నారు. ప్రస్తుతానికి ఒక్కరు మాత్రమే పట్టుబడ్డారని, ఇద్దరిని ఎన్‌కౌంటర్ చేసినట్టుగా జరుగుతున్న ప్రచారం నిజం కాదని తేల్చారు.

నిజానికి.. వాతావరణం అలాగే అనిపించింది. కిడ్నాప్ అయిన బాలుడు హత్యకు గురైనట్లు వార్త వచ్చిన తర్వాత.. అదనపు పోలీసు బలగాల్ని తరలించడం, రోప్ పార్టీలను తీసుకెళ్లడం ఇలాంటి వ్యవహారాలన్నీ ఎన్‌కౌంటర్ జరుగుతుందనే అభిప్రాయం కలిగించేలా సాగాయి. స్థానిక విలేకర్లతో మాట్లాడినప్పుడు.. ‘ఇంకా కాలేదు.. కానీ, అయితది’ అనే మాటే వినవచ్చింది. ఒకవేళ ఎన్ కౌంటర్ జరగవచ్చేమో కూడా.. కానీ, బాధ్యతగల పత్రికలు నిజానిజాలు చెక్ చేసుకోకుండా ‘క్వశ్చన్ మార్క్ (?)’ పెట్టి అబద్ధాలను ప్రచారంలో పెట్టేయవచ్చు కదా.. అని మీడియా విలువల్లోని లొసుగుల్ని వాడుకుని.. ఇలా చెలరేగితే ఎలా? మనం ఓసారి మన ప్రవర్తన తీరు తెన్నల్ని సమీక్షించుకోవాలి.

.. సురేష్ పిళ్లె

Tags: editorialencounterleotopmahaboobabad dikshitsureshpillai
Previous Post

ఏమిటీ ‘నర్తనశాల’.. బాలకృష్ణ, సౌందర్య ఏంచేశారు?

Next Post

‘నర్తనశాల’ బాటలో ఆగిపోయిన చిరంజీవి సినిమా?

Related Posts

Andhra Pradesh

ఆత్మీయత పంచుతూ,ఆత్మస్థైర్యం నింపుతూ

by Leo Cinema
February 3, 2023 6:16 pm

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు...

Andhra Pradesh

ఎవరు పోలీసో..? ఎవరు అసాంఘిక శక్తో..

by Leo Cinema
February 2, 2023 6:58 pm

ఎవరు పోలీసో..? ఎవరు అసాంఘిక శక్తో..అర్ధంగాని పరిస్థితిలోకి ఆంధ్రప్రదేశ్ నెట్టబడిందా..? పోలీసులకు, అసాంఘిక...

General

దగా పడ్డ యువత కోసం యువగళం!

by Leo Editor
January 26, 2023 5:38 pm

ఉన్మాది పరిపాలనలో చరిత్ర ఎరుగని సంక్షోభం, సమాజం ఎరుగని భాధలు రాష్ట్రాన్ని చుట్టు...

General

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

by Leo Editor
January 19, 2023 5:10 pm

ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులను,టెర్రరిజం పరిపాలన గురించి అంతర్జాతీయ వేదికలపై చెప్పుకొంటున్న...

General

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

by Leo Editor
January 13, 2023 6:40 pm

స్వతంత్ర భారతదేశంలో పోలీసులు ఎలా ఉండాలి అన్న ప్రశ్నకు 1940 లో మహాత్మా...

General

బెల్టు షాపులు రద్దు పై జగన్ భీషణ ప్రతిజ్ఞలు డొల్ల!

by Leo Cinema
January 12, 2023 5:38 pm

పేద ప్రజల ఆస్తులు,ఆరోగ్యం గుల్ల చేస్తున్న బెల్టు షాపులను రద్దు చేసాం అంటూ...

Andhra Pradesh

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

by Leo Cinema
January 11, 2023 3:30 pm

తీవ్రమైన ధరాఘాతంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు.పెరిగిన నిత్యావసర ధరలను చూస్తే ఏం కొనేట్టు లేదు,తినేటట్టు...

Andhra Pradesh

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

by Leo Cinema
January 11, 2023 1:42 pm

రాష్ట్ర ప్రజల ప్రతి కదలిక పై నిరంతరం నిఘాపెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.ప్రజల...

Latest News

అధికార పార్టీ నాయకుల ఆర్తనాదాలు!

by Leo Editor
January 9, 2023 1:26 pm

ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ సమావేశం అవ్వడంతో అధికార మంత్రులు, నాయకులు...

Latest News

మన ప్రజాస్వామ్యం ఎవ్వరి కోసం?

by Leo Editor
January 9, 2023 12:58 pm

రాజులు, రాచరికాలు వద్దు అనుకొన్నాము, నిరంకుశులను, నియంతృత్వాలను పాతరేశాం. బానిస బతుకులు వద్దని...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి?

ఎవరు పోలీసో..? ఎవరు అసాంఘిక శక్తో..

క్లీన్ క్లీవేజ్ షోతో కాకపుట్టించిన కాజల్ అగర్వాల్

Online Dating Safety and How to Recognize Red Flags

ఘనంగా ఎన్.టి.ఆర్ శత జయంతి వేడుకలు

వాల్మీకి ఎవరు? ఎక్కడివాడు?

దుర్గగుడి ఈవోగా బాధ్యతలు స్వీకరించిన భ్రమరాంబ     

Actress Pragathi Latest Pics Going Viral

ఎంతో ఘాటు ప్రేమతో కుర్రకారును కిర్రెక్కించే వెబ్ సిరీస్

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

ముఖ్య కథనాలు

ఘనంగా ఎన్.టి.ఆర్ శత జయంతి వేడుకలు

సుమధుర గాయని వాణీ జయరాం మరణం ఎలా?

మహానటి సావిత్రితో పోటీపడి నటించిన జమున

హంట్ మూవీ రివ్యూ

దగా పడ్డ యువత కోసం యువగళం!

ఆస్కార్ అవార్డుల ఎంపికలో కీలక ఘట్టం

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

వాల్తేరు వీరయ్య (రివ్యూ)

బెల్టు షాపులు రద్దు పై జగన్ భీషణ ప్రతిజ్ఞలు డొల్ల!

సంపాదకుని ఎంపిక

ఎవరు పోలీసో..? ఎవరు అసాంఘిక శక్తో..

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త పొత్తు పొడవబోతోందా ?

జగన్ @1000 వైసీపీ వెయ్యి రోజుల పాలన

సొంత గూటిలో అసమ్మతి సెగలు! ప్రజల నుంచి ఛీత్కారాలు!!

వినోదం వెన్ను విరిచారుగా?

ఒకే ఏడాదిలో టీడీపీకి రెండు పండుగలు! అధికారం దిశగా పార్టీ అడుగులు! లోకేష్ మహాపాద యాత్రకు సర్వసిద్ధం!!

చిత్తూరు జిల్లాలో వైసీపీ నేత భూ మాఫియా.. రూ. 20 కోట్ల ప్రభుత్వ భూమి హంఫట్?

వైసిపికి షాక్ ఇవ్వనున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ?

రాజకీయం

ఆత్మీయత పంచుతూ,ఆత్మస్థైర్యం నింపుతూ

ఎవరు పోలీసో..? ఎవరు అసాంఘిక శక్తో..

కర్షకుల మోములో కాంతులీనని సంక్రాంతి!

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

మంగళగిరి లో ఆర్కేకి మంగళం పాడనున్న ప్రజలు

ఆర్కే మార్క్ రాజకీయం

చుట్టాలు వ‌స్తున్నారు జాగ్ర‌త్త బాబూ!

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూత.

జగన్ రెడ్డి కొత్త నిర్ణయంతో ఏపీలో ఏరులై పారనున్న మద్యం..

సినిమా

ఘనంగా ఎన్.టి.ఆర్ శత జయంతి వేడుకలు

సుమధుర గాయని వాణీ జయరాం మరణం ఎలా?

కోనసీమ థగ్స్ లోనూ వీరయ్య విలన్ బాబి సింహా

మహానటి సావిత్రితో పోటీపడి నటించిన జమున

హంట్ మూవీ రివ్యూ

ఆస్కార్ అవార్డుల ఎంపికలో కీలక ఘట్టం

వాల్తేరు వీరయ్య (రివ్యూ)

వీరసింహారెడ్డి (రివ్యూ)

నమ్మకం కలిగితే దర్శకత్వం చేస్తా: చిరంజీవి

హంట్ సినిమా యాక్షన్ మేకింగ్ వీడియో విడుదల

సభా ప్రాంగణానికి బాలయ్య, శ్రుతి హాసన్

జనరల్

Online Dating Safety and How to Recognize Red Flags

దగా పడ్డ యువత కోసం యువగళం!

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

బెల్టు షాపులు రద్దు పై జగన్ భీషణ ప్రతిజ్ఞలు డొల్ల!

వైసీపీ గుంపు నీచ రాజకీయం!

జనవంచనలో జగన్ ఘనుడు?

2024లో చంద్రబాబు నాయుడు సీఎం అవుతారా?

పవన్ కళ్యాణ్ వారాహికి.. రంగు పడిందా?

బావ, అల్లుడిపై అస్త్రాలు సంధించిన బాలయ్య

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In