పిరికిపంద రాజకీయాలు చేసుకుంటూ.. పల్నాడు పరువు తీస్తున్నడని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై సోషల్ మీడియాలో విశ్లేషణలు ఊపందుకున్నాయి.
పల్నాడు జిల్లా మాచర్ల నయోజకవర్గంలో రాజకీయాలు గత రెండేళ్లుగా హీటును తలపిస్తున్నాయి. సరిగ్గా రెండేళ్ల క్రితం ఈ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైన జూలకంటి బ్రహ్మానందరెడ్డిని ఇంచార్జ్ గా ప్రకటించారు అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఆనాటి నుంచి మాచర్లలో రాజకీయ స్వరూపం ఒక్కసారిగా మారింది. స్లీపర్ సెల్స్ గా ఉన్న టీడీపీ యాక్టీవిస్టులందరూ ఒక్కసారిగా యాక్టీవ్ మోడ్ లోకి వచ్చారు. పసుపు శ్రేణులకు నూతన ఉత్సాహాన్ని తెచ్చేలా బ్రహ్మారెడ్డి నియామకాన్ని అన్నీ వర్గాల వారు హర్షం వ్యక్తం చేశారు.
గడిచిన రెండేళ్ళుగా పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేలా బ్రహ్మారెడ్డి వేస్తున్న అడుగులకు నియోజకవర్గ ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. ఈ నేపధ్యంలో బ్రహ్మారెడ్డికొస్తున్న మైలేజ్ ని తట్టుకోలేక స్ధానిక ఎమ్మెల్యే పీఆర్కే అండ్ కో కు వెన్నులో ఓటమి వణుకు పట్టుకుంది. ఈ నేపధ్యంలో మాచర్లలో గతంలో ఎన్నడూ లేని రాజకీయ సంస్కృతికి పీఆర్కే తెరతీస్తున్నారు. తెలుగు దేశం పార్టీ ఇంచార్జ్ బ్రహ్మారెడ్డి నియోజకవర్గంలో ఏ కార్యక్రమం మొదలుపెట్టినా.., వాటిని అడ్డుకోవడం.., కేసులు పెట్టడం.., దాడులు చేయడం వంటి కుట్రలు నిత్యకృత్యంగా పెట్టుకున్నారు.
పసుపు ఫ్లెక్సీ కట్టినా.. టీడీపీ జెండా కట్టినా.., పట్టినా.. పోలీసులను పంపి.. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో గ్రామాల్లో ఇంచార్జ్ బ్రహ్మారెడ్డి పర్యటించినా.., ఆ గ్రామాల్లో ఏదైన ఉత్సవాలు.., తిరునాళ్ళకు హాజరైనా కేసే. తాజాగా క్రిస్మస్, నూతన సంవత్సరం ఉత్సవాలను పురష్కరించుకుని గ్రాండ్ గా సెలబ్రేషన్ చేద్దామని తెలుగుదేశం పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న సమయంలో ఇంచార్జ్ బ్రహ్మారెడ్డిపై సంబంధంలేని అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తనకు సంబంధంలేని కేసులో ఇరికించేందుకు పిన్నెల్లి కుట్రలు పన్నుతున్నారని బ్రహ్మరెడ్డి మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయాలు చేతకాక నియోజకవర్గంలో ఆరాచక పాలనకు తెరతీస్తున్నారని.., పల్నాటి చరిత్రలో పీఆర్కే లాంటి పిరికిపందను ఎన్నడూ చూడలేదని చెప్పుకొచ్చారు. ఎన్ని కేసులు పెట్టినా.., జైలుకు పంపినా.., మాచర్ల లో హింసాత్మక రాజకీయాలను సహించే ప్రసక్తేలేదన్నారు. ఇలా మాచర్లలో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బ్రహ్మారెడ్డి పై.., శ్రేణులపై ఏదోఒక అక్రమ కేసులు పెట్టి.., ఇబ్బందులకు గురిచేయడం పొలిటికల్ గా పరిపాటిగా మారిందని విశ్లేషణలు గత రెండేళ్ళుగా వినిపిస్తున్నవే.











