సహకార రంగంలోని సంగం డెయిరీని ప్రైవేటు కంపెనీగా మార్చి అవినీతికి పాల్పడ్డారని దూళిపాళ్ల నరేంద్రపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోందు చేసింది. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడిలో దూళిపాళ్ల నరేంద్ర ఇంటికి చేరుకున్న వందలాది మంది పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. తెల్లవారుజామునే వచ్చిన పోలీసులు ఉదయం 7 గంటలకు దూళిపాళ్ల నరేంద్ర భార్యకు నోటీసులు అందించి ఆయన్ని అరెస్టు చేశారు. అనంతరం పోలీసులు దూళిపాళ్ల నరేంద్రను వైద్య పరీక్షల నిమిత్తం బాపట్ల తరలించినట్టు తెలుస్తోంది.
నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు
సంగం డెయిరీలో అవినీతికి పాల్పడ్డారంటూ దూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు ఆయనపై 408, 409, 418, 420, 465 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నరేంద్ర అరెస్టు సమయంలో చింతలపూడి గ్రామంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారు. నరేంద్ర అరెస్టును అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించగా పోలీసులు వారిని పక్కకు లాగిపడేశారు. మరోవైపు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే నరేంద్రను అరెస్టు చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ఎండగడుతున్న వారిపై సీఎం అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని టీడీపీ నేతలు విమర్శించారు.
Must Read ;- సంగం డెయిరీని దెబ్బతీసేందుకే దూళిపాళ్ల అక్రమ అరెస్ట్ : చంద్రబాబునాయుడు











