June 26, 2026 12:03 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editorial

హైదరాబాద్ లో టీడీపీ ఓటు బ్యాంకు ఎటు వైపు..

November 16, 2020 at 12:53 PM
in Editorial, Editors Pick, Politics, Telangana
GHMC Elections Chandrababu Naidu
Share on FacebookShare on TwitterShare on WhatsApp

త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతోపాటు టీడీపీకూడా ఇక్కడ బరిలోకి దిగనుంది. 150 డివిజన్ లు ఉన్న జీహెచ్ఎంసీలో ఎన్ని స్థానాల్లో టీడీపీ బరిలోకి దిగనుంది అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు గరిష్టం 45సీట్లలో పోటీచేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఆ 45 డివిజన్లలో ఒంటరిగా పోటీ దిగుతుందా.. పొత్తులేమైనా ఉంటాయనే అనేది కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్ని డివిజన్ లలో పోటీ చేస్తుందనే విషయం పక్కనపెడితే అసలు జీహెచ్ఎంసీ పరిధిలో టీడీపీ ఓటు బ్యాంకు బలం ఎంత ఉంది, ఆ ఓటు బ్యాంకు ఎటువైపు మొగ్గుచూపుతుందనే చర్చ పార్టీల్లో నడుస్తోంది. ఇందుకు గత పదేళ్లలో జరిగిన అసెంబ్లీ, జీహెచ్ఎంసీ ఎన్నికలను పరిశీలిస్తే..

2016లో 51చోట్ల రెండో స్థానంలో..

2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ 2016 లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే టైంలో మంచి స్పీడుమీద ఉంది. సెంటిమెంట్ బలంగా ఉంది. ఆ టైంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని 94స్థానాల్లో పోటీచేసిన టీడీపీ ఒక్క స్థానంలో అదీ కేపీహెచ్ బీ కాలనీలో  గెలుపొందింది. టీడీపీ ఒక్కసీటే గెలిచినా..ఓట్లు భారీగానే రాబట్టింది. ఆ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు 33,49,379 కాగా టీడీపీకి (బీజేపీకి కాకుండా) 4,39,047 ఓట్లు వచ్చాయి. అంటే 13.11శాతం ఓట్లు వచ్చాయి. పోటీచేసిన చోట్ల 51 డివిజన్లలో రెండో స్థానంలో, 24 డివిజన్లలో మూడోస్థానంలో, 14 డివిజన్లలో 4వ స్థానంలో నిలించింది. రెండో స్థానంలో నిలిచిన 51 డివిజన్లలో గెలుపోటములకు తేడా 15శాతంలోపే ఉండడం గమనార్హం. తరువాతి కాలంలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు పార్టీని వీడడం,  ఓటుకు నోటు కేసు, కేసీఆర్ లేవనెత్తిన సెంటిమెంట్ తదితర కారణాలతో టీడీపీ తన వైభవాన్ని కోల్పోయిందని చెప్పవచ్చు.

2009లో హవా..

అదే 2009 GHMC ఎన్నికలలను చూసుకుంటే ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీచేసేందుకు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఆ సమయంలో కనిపించింది. బీజేపీ, టీడీపీ లు వేర్వేరుగా పోటీచేసిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 52, టీడీపీ 45, ఎంఐఎం 43, బీజేపీ 5, ప్రజారాజ్యం పార్టీ 1, ఇతరులు నాలుగుచోట్ల గెలుపొందారు. టీడీపీ, బీజేపీ కలిపి 50 స్థానాలు కైవసం చేసుకున్నాయి. అప్పుడు దాదాపు 14లక్షల ఓట్లకు పైగా టీడీపీ సాధించింది.

అసెంబ్లీ సెగ్మెంట్లలో..

2014లో జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న, అప్పటి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న 24 అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ, బీజేపీ కలసి పోటీచేశాయి. టీడీపీ 9, బీజేపీ 5 స్థానాలు సాధించాయి. దాదాపు 28లక్షల ఓట్లు ఈ రెండు పార్టీలూ సాధించాయి. అప్పటి ఎంపీ ఎన్నికల్లోనూ నాలుగుసీట్లలో బీజేపీ 1, టీడీపీ 1 గెలుపోందాయి. 2018, 2019 అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో కూటమిగా ఏర్పడినా ఒక్కసీటూ సాధించలేకపోయింది. కంచుకోటగా భావించే కూకట్ పల్లి సీటునూ గెలుచుకోలేకపోయింది. అయితే మొత్తంమీద లక్షల సంఖ్యలో ఓట్లను మాత్ర రాబట్టింది. ఇప్పుడు చర్చ అంతా ఆ ఓట్లపైనే నడుస్తోంది.

ఇదే ఓటు బ్యాంకు..

తమకు కొన్ని వర్గాల్లో మంచి ఓటు బ్యాంకు ఉందని టీడీపీ చెబుతోంది. టీడీపీ హయాంలో ఉద్యోగాలు పొందిన యువత, సెటిలర్లు, కొన్ని సామాజిక వర్గాలు, తెలంగాణేతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు తమకు ఓటు బ్యాంకుగా ఉన్నారని టీడీపీ చెబుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఎల్బీనగర్, మల్కాజిగిరి, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, ఉప్పల్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేయగల స్థాయిలోనే ఉన్నారని పార్టీ చెబుతోంది. అంతే కాకుండా జీహెచ్‌ఎంసీ ఈస్ట్‌ జోన్‌ పరిధిలోని కాప్రా, ఏఎస్‌రావునగర్‌, చర్లపల్లి, మల్లాపూర్‌, నాచారం, హెచ్‌బీకాలనీ, బీఎన్‌రెడ్డినగర్‌, గడ్డిఅన్నారం, చైతన్యపురి, వనస్థలిపురం, కొత్తపేట్‌, నాగోల్‌, వెస్ట్‌ జోన్‌ పరిధిలో కేపీహెచ్‌బీ, బాలాజీనగర్‌, హైదర్‌నగర్‌, ఆల్వీన్‌ కాలనీ, వివేకానందనగర్‌, మూసాపేట్‌, చందానగర్‌, మా దాపూర్‌, గచ్చిబౌలి, నార్త్‌ జోన్‌ పరిధిలో సూరారం, చింతల్‌, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌, ఈస్ట్‌ఆనంద్‌బాగ్‌, గౌతంనగర్‌, స ఫిల్‌గుడ, మౌలాలి, బౌద్దనగర్‌, సీతాఫల్‌ మండి, బేగంపేట్‌, బన్సీలాల్‌పేట్‌, రాంగోపాల్‌పేట్‌, తార్నాక, మెట్టుగుడ, సెం ట్రల్‌ జోన్‌ పరిధిలో అమీర్‌పేట్‌, సనత్‌నగర్‌, వెంకటే శ్వరకాలనీ, సోమాజీగుడ, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, యూసప్‌గుడ వార్డుల్లో కేపీహెచ్‌బీకాలనీ, నాచారం, RK పురం తదితర ఏరియాల్లో ఓటు బ్యాంకు ఉందని టీడీపీ చెబుతోంది.

ఎటువైపు మళ్లితే..లాభం

టీడీపీ ఒంటరిగా పోటీచేస్తే గరిష్టం 7శాతం ఓట్లు వస్తాయన్న అంచనాలు ఉన్నాయి. ఆ ఓటు బ్యాంకు వల్ల టీడీపీ గెలవకున్నా.. వైరి పార్టీకి వెళ్లే ఓట్లను చీల్చే అవకాశం ఉంది. గతంలో జరిగిన పలు ఎన్నికల్లో సెంటిమెంట్ ను టీఆర్ఎస్ తెరపైకి తెచ్చింది. హైదరాబాద్ డెవలప్ మెంట్ పై టీఆర్ఎస్ పార్టీ అప్పట్లో టీడీపీని, కాంగ్రెస్ ను టార్గెట్ చేసింది. కాని గత ఐదేళ్లుగా టీఆర్ఎస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆ విమర్శలు ఇప్పుడు చేసినా.. అప్పటి స్థాయిలో పనిచేయకపోవచ్చు. సెంటిమెంట్ పరిస్థితి కూడా అంతేనన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఓటు బ్యాంకు ఏ పార్టీవైపు మళ్లితే వారికి గెలుపు సులువు కానుందన్న అంచనాలు మొదలయ్యాయి. ఇందుకు కొన్ని ఉదాహరణలూ నాయకులు చెబుతున్నారు.

రేవంత్ గెలుపు..

2019లో మల్కాజ్ గిరి లో ఎంపీగా రేవంత్ రెడ్డి గెలుపొందారు. ఆయన కాంగ్రెస్ నుంచి పోటీచేసినా.. అంతకు ముందు టీడీపీలో ఉన్నారు. టీడీపీని వీడినా.. ఆ పార్టీని, నాయకులను ఎక్కడా పెద్దగా విమర్శించలేదు. దీంతో టీడీపీ ఓటు రేవంత్ కు ప్లస్ అయిందని అప్పట్లో చర్చ నడిచింది. మొన్న దుబ్బాకలోనూ అదే పరిస్థితి. ప్రధానమైన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యే నడిచింది. అయితే దుబ్బాకలో టీడీపీ గతంలో గణనీయమైన ఓటు బ్యాంకు కలిగి ఉంది. ఈసారి టీడీపీ పోటీ చేయలేదు. ఈ ఎన్నిక్లో టీడీపీ ఓట్లు టీఆర్ఎస్ కు పడలేదని, కాంగ్రెస్ వైపూ వెళ్లలేదని బీజేపీకి లాభించాయని విశ్లేషనలు వచ్చాయి. ఎందుకంటే.. కేవలం 2018,2019లోనే టీడీపీ –కాంగ్రెస్ లు కూటమి కట్టాయి. చరిత్రలో అలాంటి పొత్తు టీడీపీ శ్రేణులకు పరిచయం లేదు. కాని బీజేపీతో పలు మార్లు టీడీపీ పొత్తు పెట్టుకుంది. దీంతో టీడీపీ, బీజేపీ ఓట్ల బదలాయింపు కొంత ఈజీగా జరిగిందని చెబుతున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్కకు కూడా టీడీపీ ఓటు బ్యాంకు సపోర్టుగా ఉంది. సీతక్క కూడా పార్టీని వీడినా..టీడీపీని టార్గెట్ చేసి విమర్శించిన దాఖలాలు లేవు. దీంతో టీడీపీ కేడర్ వారికే అండగా నిలిచింది. ఇక జీహెచ్ఎంసీ విషయానికి వస్తే..టీడీపీ ఓటు బ్యాంకును ఆకట్టుకునే నాయకులు, పార్టీలకు గెలిచేందుకు ఈజీ అవుతుందనే అంచనాలు మొదలయ్యాయి.

తుమ్మల అడుగులు ఎటువైపు..

ఇక టీడీపీలో కీలకనేతగా ఉండి తరువాతి కాలంలో టీఆర్ఎస్ కు వెళ్లిన తుమ్మల నాగేశ్వరరావు అడుగులుకూడా GHMC ఎన్నికలపై ప్రభావం చూపుతాయన్న అంచనాలు ఉన్నాయి. టీడీపీనుంచి టీఆర్ఎస్ కు వెళ్లిన తుమ్మలకు టీఆర్ఎస్ అప్పట్లో మంత్రి పదవి ఇచ్చింది. MLCని చేసింది. తరువాత జరిగిన ఎన్నికల్లో తుమ్మల ఓడిపోయారు. అదే టైంలో కేటీఆర్ కు దగ్గరగా ఉండే పువ్వాడ అజయ్ కుమార్ గెలిచారు. దీంతో జిల్లాలోనూ, పార్టీలోనూ తుమ్మలకు ప్రాధాన్యం తగ్గిందని ఆయన వర్గం అభిప్రాయ పడుతోంది. ఆయన టీఆర్ఎస్ ను వీడనున్నారనే ప్రచారం కూడా నడుస్తోంది. దీంట్లో వాస్తవికత ఎంత అనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే తుమ్మల అటు బీజేపీకి, ఇటు టీడీపీకి వెళ్లినా GHMCలో టీఆర్ఎస్ కు నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే తుమ్మలకు హైదరాబాద్ లో ఆయన సామాజిక వర్గంతోపాటు ఆయన ప్రాంతానికి చెందిన హైదరాబాద్ లో ఉండే ఓటర్లలో చాలా పట్టు ఉంది. సో..తుమ్మల అడుగులు కూడా GHMC ఎన్నికల్లో టీడీపీ లేదా బీజేపీ ఓట్లను ప్రభావితం చేయనున్నాయి.

Tags: Asaduddin OwaisiBharatiya Janata PartybjpcbnChandrababu NaiducongresselectionsghmcGHMC electionsINCIndian National Congresskcrktrlokeshmimnara chandrababu naidunara lokeshRevanth Reddytdptelanganatelugu desamtelugu desam partytrsTummala Nageswara Rao
Previous Post

హెలికాఫ్ట‌ర్‌లో తుమ్మ‌ల ఇంటికి ఆ ఇద్ద‌రు మంత్రులు ఎందుకు వెళ్లారు?

Next Post

ఆరు సినిమాలతో రామ్ ఖాతాలోకి కొత్త రికార్డ్

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

ఈజిట్!.. ఆనంద‌య్య చుక్క‌ల మందు నాట్ గుడ్‌?

తెలుగు సినిమాలో ఎస్వీఆర్ యశస్సు

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

‘వీరమల్లు’ కోసం రంగాన్ని సిద్ధం చేసిన క్రిష్   

ఐపీఎల్-13: చెన్నై జోరు కొనసాగేనా?

శశికళ జైలు నుండి విడుదల

శివ శివా… కాకినాడలో గుడి పూజారిపై ఎటాక్‌.. వైసీపీ నేతల అరాచకం..!!

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist