కరోనా మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. గత ఆరు నెలలుగా దేశవ్యాప్తంగా సినిమా షూటింగ్ లు నిలిచిపోయాయి. కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తయిన వాటిని ఓటీటీల్లో రిలీజ్ చేయలేక, రిలీజ్ డేట్ లని వాయిదా వేసుకున్నాయి. ప్రస్తుతం దేశంలో అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతుండడంతో సినిమా షూటింగ్లు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా హాళ్లు అక్టోబర్ 15వ తేదీ నుండి తెరుచుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కొన్ని నిబంధనలు పాటిస్తూ తెరుచుకోవచ్చని తెలిపింది.
దీంతో సినీ పరిశ్రమలో సందడి మొదలైంది. 80శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రాల్ని త్వరగా పూర్తి చేసి తమ టీజర్లతో దసరాకు హంగామా చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ప్రేక్షకులను అలరించే విషయంలో `కేజీఎఫ్ చాప్టర్ 2` ముందువరసలో నిలవబోతోంది. ఈ చిత్రం నుంచి టీజర్ ని త్వరలోనే రిలీజ్ చేయబోతోందీ చిత్ర బృందం. ఇక 80శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న మరో క్రేజీ మూవీ ‘వకీల్ సాబ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలకాలం గ్యాప్ తీసుకోని తిరిగి నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి విజయదశమి రోజున టీజర్ రిలీజ్ అవుతుందని టాలీవుడ్ టాక్.
ఇక `ఆర్ఆర్ఆర్` విషయానికి వస్తే టీజర్ రిలీజ్ కు సై అంటోంది. ఎన్టీఆర్ నటించిన కొరమం భీం పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ని రాజమౌళి రిలీజ్ చేయబోతున్నారు. వీరితో పాటు మెగాస్టారు చిరంజీవి కూడా తన అభిమానులకు దసరా గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘ఆచార్య’ చిత్రానికి సంభందించి టీజర్ రిలీజ్ చేయబోతుంది చిత్ర బృందం. వీటితోపాటుగా మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’, కింగ్ నాగార్జున నటిస్తున్న ‘వైల్డ్ డాగ్’, ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ టీజర్ ల దండ యాత్ర జరగబోతోంది. చూడాలి మరి బాక్స్ ఆఫీస్ వద్ద విజయం ఎవరిది అనేది.











