గురజాలలో మైనింగ్ మాఫియా ఆగడాలు …!
గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం. అధికార పార్టీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఎమ్మెల్యే కనుసన్నల్లో దాచేపల్లి, పిడుగురాళ్ల, కోనంకి, తంగెడ, కేసనపల్లి ఏరియాల్లో టన్నలు కొద్ది ముగ్గురురాయి, సున్నం రాయిని మైనింగ్ మాఫియా వాటాలు వేసుకుని దోచేస్తున్నారు. సహజ వనరులు టన్నుల కొద్ది అక్రమ మైనింగ్ రూపంలో దోపిడికి గురౌతున్నాయి. ఈ దందాంతా ఒకవైపైతే .. నియోజకవర్గ పరిధిలోని దాచేపల్లి మండలం నడికూడిలోని నారాయణపురం ముగ్గురాయి క్వారీల చుట్టే గత రెండేళ్లుగా రాజకీయం తిరుగుతోంది. గతంలో ఈ క్వారీల్లో వాటాలు, హక్కులు కోసం రెండు గ్రూపులు కత్తులు దూసుకున్నారు. తాజాగా దాచేపల్లి నగరపంచాయితీ జరిగిన ఎన్నికల్లో వడ్డెర సామాజీక వర్గానికి చెందిన కొంతమంది క్వారీ కూలీలు.. టీడీపీ కౌన్సిలర్ ను గెలిపించారు. దీంతో కక్ష కట్టిన అధికార వైసీపీ.. టీడీపీ కౌన్సిలర్ గెలిపించిన 50 కుటుంబాలను పనులకు రానివ్వండి బహిష్కరించారు. దీంతో క్వారీ వద్ద ధర్నాకు దిగారు కూలీలు. తమ వ్యక్తిగతాన్ని ఎత్తిచూపుతూ.. మా ఉపాధిపై కొట్టడమేంటి? అని ప్రశ్నించారు. ఓటు అనేది రాజ్యాంగ కల్పించిన హక్కు.. ఆ హక్కును రాజకీయాలు కాలరాస్తే ఎలా అని నిలదీశారు. చివరికి కూలీల ఆర్తనాదాలను కవర్ చేద్దామని వచ్చిన వారిపై కూడా మాఫియా దాడులకు యత్నించడం కడు దుర్మార్గమని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఖండించారు.
Must Read ;- దివాలకు దరిదాపుల్లో ఏపీ ప్రభుత్వం!