టాలీవుడ్ విలక్షణ నటుడు మోహన్ బాబు ‘గాయత్రి’ సినిమా తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు. ఆ సినిమా మంచి ఫలితం రాబట్టలేదు. మంచి కథ, పవర్ ఫుల్ పాత్ర దొరికితే మరో సినిమా చేయాలని మోహన్ బాబు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘గాయత్రి’ సినిమాకి కథ, మాటలు అందించిన డైమండ్ రత్నబాబు .. దర్శకత్వంలో మోహన్ బాబు మరో సినిమాలో నటించడానికి రెడీ అయ్యారు. సినిమా పేరు ‘సన్నాఫ్ ఇండియా’. దేశభక్తి నేపథ్యంలో సాగే ఓ సందేశాత్మక సినిమాగా ‘సన్నాఫ్ ఇండియా’ తెరకెక్కనుంది. ఈ సినిమా నేడు హైద్రాబాద్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మోహన్ బాబు ఈ విషయాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియచేశారు.
24 పిక్చర్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్నపిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమాను మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించనుండడం విశేషం. ముహూర్తపు సన్నివేశానికి లక్ష్మీప్రసన్న నిర్వాణ క్లాప్ కొట్టగా, వెరోనికా మంచు , ఐరా, అవ్రాజ్ కెమేరా స్విచ్ ఆన్ చేశారు. మంచు విష్ణు గౌరవ దర్శకత్వం వహించారు. ఇక మోహన్ బాబు ఈ సినిమాకి స్ర్కీన్ ప్లే అందిస్తున్నారు. ఈ ఏడాది ఇండిపెండెన్స్ డేకి విడుదలైన సన్నాఫ్ ఇండియా పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
Started #SonofIndia today. Excited! pic.twitter.com/u3lTWXeuYV
— Mohan Babu M (@themohanbabu) October 23, 2020