డ్రగ్స్ కేసు గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీను షేక్ చేస్తోంది. ఆమధ్య టాలీవుడ్ లో కొంత సినీ ప్రముఖులును డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారించడం సంచలనం అయ్యింది. ఆ తర్వాత ఈ కేసులో టాలీవుడ్ తారలకు తెలంగాణ ప్రభుత్వం క్లీన్ చిట్ ఇవ్వడం తెలిసిందే. ఇటీవల ముంబాయిలో డ్రగ్స్ పట్టుబడడంతో డ్రగ్స్ కేసు బాలీవుడ్ ని చుట్టుకుంది. తాజాగా ముంబైలోని మీరా రోడ్డు దగ్గర హోటల్ లో పోలీసులు రైడ్ చేసినప్పుడు డ్రగ్స్ తో ఓ తెలుగు హీరోయిన్ పట్టుబడిందని వార్తలు వచ్చాయి.
దీంతో ముంబాయిలో డ్రగ్స్ తో పట్టుబడ్డ తెలుగు హీరోయిన్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. తాజా సమాచారం ప్రకారం ఆ హీరోయిన్ శ్వేతా కుమారి అని తెలుస్తోంది. ఈమె పలు సినిమాల్లోనూ, టీవీ సీరియల్స్ లోనూ నటించింది. హైదరాబాద్ కు చెందిన డ్రగ్స్ డీలర్ చాంద్ పాషాతో పాటు ఈ శ్వేతకుమారి ఉందట. ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్. ఆ హీరోయిన్ తెలుగులో ఓ నాలుగు సినిమాల్లో నటించిందట.
అలాగే పలు సీరియల్స్ లో కూడా నటించిందని తెలిసింది. మరికాసేట్లో పోలీసులను ఆమెను కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. ఆమెకు డ్రగ్స్ డీలర్ చాంద్ పాషాతో ఎలా పరిచయం ఏర్పడింది..? ఈ డ్రగ్స్ కు ఆమె బానిస అయ్యిందా..? లేక డ్రగ్స్ సప్లై చేస్తుందా.? తదితర విషయాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.