” లక్ష్యం ” సినిమాతో డైరెక్టర్ గా తన జర్నీ మొదలు పెట్టిన శ్రీవాస్ తర్వాత ” రామ రామ కృష్ణ కృష్ణ ‘, ‘ పాండవులు పాండవులు తుమ్మెద’, ‘ లౌక్యం ‘ , ” డిక్టేటర్ , ‘ సాక్ష్యం ‘ మొదలు అయిన సినిమాలు డైరెక్ట్ చేశారు . ఇప్పుడు నిర్మాత గా కొత్త అవతారం ఎత్తారు శ్రీవాస్. శ్రేయాస్ మీడియాస్ అనే సంస్థ, రామ్ గోపాల్ వర్మ ని నమ్ముకుని, ఏటీటీ కోసం రాంగోపాల్ వర్మ తో కొన్ని సినిమాలు నిర్మించింది. రామ్ గోపాల్ వర్మ వివాదాస్పదం అయిన సినిమాలు తీయడం తో వర్మ ని వదిలేసింది శ్రేయాస్ . అయితే –ఏటీటీ ప్లాటుఫారం కోసం కొత్త కంటెంట్ కావాలి కాబట్టి, దర్శకుడు శ్రీవాస్ తో చేతులు కలిపింది .
శ్రీవాస్ నిర్మాతగా రెండు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. శివ నాగేశ్వర రావు డైరెక్షన్ లో ‘ క్రేజీ అంకుల్స్ ‘ అనే సినిమా నిర్మిస్తున్నారు . ‘ క్రేజీ అంకుల్స్ ‘ లో మనో , రాజా రవీంద్ర , శ్రీముఖి తదితరులు నటిస్తున్నారు . మరో సినిమా సంపూర్ణేష్ బాబు తో తీస్తున్నారు. ఈ రెండు సినిమాలు షూటింగ్ చివరి దశలో ఉన్నాయి. త్వరలలోనే శ్రేయాస్ ఏటీటీ లో విడుదల కానున్నాయి.